Kurnool: యువతీ గర్భంతో తనకు సంబంధం లేదన్న యువకుడు.. యువతి చేసిన పనికి చివరికి అలా?
ప్రస్తుత రోజుల్లో యువత చాలా మంది ప్రేమ పేరుతో జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ చెక్క పట్టాలేసుకొని తిరగడం పెళ్లికి
- By Nakshatra Published Date - 04:17 PM, Sun - 4 June 23
ప్రస్తుత రోజుల్లో యువత చాలా మంది ప్రేమ పేరుతో జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ చెక్క పట్టాలేసుకొని తిరగడం పెళ్లికి ముందే గర్భం దాల్చడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది బరితెగించిన యువత ప్రెగ్నెన్సీ రాగానే ఇంట్లో వాళ్లకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూడా ఇటువంటి ఘటనే ఒకటి ఏపీలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన హనుమంతుడు అని యువకుడు మల్లనహట్టికు చెందిన ఒక యువతిని ప్రేమించాడు.
వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని చెట్టాపట్టాలేసుకుని తిరిగి శారీరకంగా కూడా కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి గర్భం దాల్చింది. కానీ హనుమంతుడు మాత్రం ఆ యువతి గర్భానికి తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆ యువతీకి షాక్ ఇచ్చాడు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. హనుమంతుడు వల్ల తాను గర్భవతిని అయ్యానని కానీ ఇప్పుడు అతను ముఖం చాటేస్తున్నాడు తనకు న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిని పిలిపించి విచారించగా తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలి అంటే డిఎన్ఏ టెస్ట్ కు కూడా తన సిద్ధమే అంటూ తెగేసి చెప్పాడు హనుమంతుడు.
దాంతో పోలీసులకు ఏం చేయాలో పాలు పోలేదు. మరోవైపు యువతి మాత్రం తరచూ హనుమంతుడికి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టింది. నీవల్లే గర్భవతి అయ్యాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే తండ్రి హనుమంతుడిని తరచూ వేధిస్తూ వచ్చింది. కానీ హనుమంతుడు మాత్రం అందుకు నిరాకరిస్తూ వచ్చాడు. కానీ ఆ యువతీ వినకుండా అలాగే వేధిస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనకు సంబంధం లేకపోయినా తన వల్లే గర్భం వచ్చింది అంటూ యువతి తనను వేధిస్తోందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Related News
Murder in Chhattisgarh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య.. ఆపై నిందితుడు ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.