T20: భారత్ దే తొలి ట్వంటీ
విండీస్ తో టీ ట్వంటీ సీరీస్ లోనూ టీం ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో రవి బిష్ణోయ్ , బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెరిశారు.
- By Naresh Kumar Published Date - 12:03 AM, Thu - 17 February 22
విండీస్ తో టీ ట్వంటీ సీరీస్ లోనూ టీం ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో రవి బిష్ణోయ్ , బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెరిశారు.
వన్డే సిరీస్ ను స్వీప్ చేసిన భారత్ కు టీ ట్వంటీ సీరీస్ ఆరంభ మ్యాచ్ లోనూ వెస్ట్ ఇండీస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. షార్ట్ ఫార్మాట్ లో చెలరేగుతారనుకున్న కరేబియన్ క్రికెటర్లు తొలి మ్యాచ్ లో తేలిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు స్వల్ప స్కోర్కే పరిమితమైంది.
అరంగేట్రం లోనే ఆకట్టుకున్న యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తో పాటు హర్షల్ పటేల్ కూడా రాణించడంతో విండీస్ 7 వికెట్లకు 157 పరుగులే చేసింది. విండీస్లో పూరన్ హాఫ్ సెంచరీ చేయకుంటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు. రవి బిష్ణోయ 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు.
చేజింగ్ లో టీమ్ ఇండియా కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 7.3 ఓవర్లలోనే
64 పరుగులు జోడించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 35 పరుగులు చేయగా…కోహ్లీ , పంత్ నిరాశ పరిచారు. అయితే వెంకటేష్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ ధాటిగా అడడంతో భారత్ 18.5 ఓవర్లలోనే టార్గెట్ చేదించింది. మధ్యలో వికెట్లు చేజార్చుకున్నా..పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో భారత్ విజయం పెద్ద కష్టం కాలేదు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సీరీస్ లో రోహిత్ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. సీరీస్ లో రెండో టీ ట్వంటీ శుక్రవారం జరుగుతుంది.
Photo Courtesy- BCCI/Twitter
#TeamIndia seal a 6-wicket win 💪💪@Paytm #INDvWI pic.twitter.com/AoDdAjA2Lh
— BCCI (@BCCI) February 16, 2022
Related News
ZIM vs IND T20: జింబాబ్వే టూర్కు కెప్టెన్గా రహానే
ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకి చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్లో రహానే ప్రదర్శన బాగుంటే జింబాబ్వే టూర్కు కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశముంది.