Raghunandan Rao :హోం మినిస్టర్ మనవడి ఫొటోలు బయటపెడతా..!!
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జోయల్ డేవిస్ తో తనకు ఎలాంటి పంచాయతీ లేదనీ...జోయల్ డేవిస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- By hashtagu Published Date - 01:11 PM, Wed - 8 June 22
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జోయల్ డేవిస్ తో తనకు ఎలాంటి పంచాయతీ లేదనీ…జోయల్ డేవిస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరో ఒత్తిడి చేస్తేనే జోయల్ డెవిస్ ప్రకటించారని రఘునందన్ అన్నారు. నిన్న ప్రెస్ మీట్లో సీపీ ఆనంద్ చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదన్నారు.
ఇన్నోవా, బెంజ్ ల యజమానులు ఎవరంటూ ప్రశ్నించారు. ఇన్నోవా ప్రభుత్వం వాహనం అయితే డ్రైవర్ ఎందుకు లేడు…కొన్ని విషయాలు దాచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. దీనిపై ఎన్నో అనుమాలు ఉన్నాయన్నారు. హోం మంత్రి మనవడుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అడిగితే తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
కాగా నిందితులకు శిక్ష పడుతుందని చెప్పడానికి సీపీ ఎవరంటూ ప్రశ్నించారు. నేను బయటపెట్టి ఫొటోల్లో ఉన్నవారు మైనర్లు, మేజర్ లా నాకెలా తెలుస్తుందని…విచారణలో తెలుస్తుందన్నారు. అందరూ మేజర్ ల లెక్కనే కనిపిస్తున్నారన్నారు. నిందితులే వీడియోలు బయట పెట్టుకున్నారని సీపీ చెప్పారు…మరి నామీద కేసు ఎక్కడిదన్నారు. వీడియోలు ఎవరు బయట పెట్టారు…ఆ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు…నోటీసులు ఇస్తే సమాధానం చెబుతానన్నారు. టీఆరెస్ కాంగ్రెస్, ఎంఐఎంలు కలిసి ముందుకు వెళ్లేందుకు ఈ కేసును వాడుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్…హిందువులకు ఒక న్యాయం…ముస్లింలకు ఒక న్యాయమా అంటూ మండిపడ్డారు రఘునందన్ రావు.
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now