HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Bcci Instructs Ipl Teams To Start Reaching Mumbai From March 8 Quarantine Mandatory

IP 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ రూల్స్ ఇవే

క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం మహారాష్ట్రలోనే జరగనున్నాయి.

  • By Naresh Kumar Published Date - 09:49 AM, Thu - 3 March 22
  • daily-hunt
Tata Ipl
Tata Ipl

క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం మహారాష్ట్రలోనే జరగనున్నాయి. ముంబై, పుణే వేదికగా ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనుంది. అయితే ఈసారి ఐపీఎల్ లో పాల్గొనబోయే అన్ని జట్లకు బీసీసీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8 నుంచి టోర్నీలోని 10 జట్లు ముంబైలోకి అడుగుపెట్టొచ్చని తెలిపింది. అయితే స్వదేశంలో ఉన్నవారైతే 3 రోజులు, విదేశాల నుంచి వచ్చేవారు 5 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది.

అలాగే ఐపీఎల్‌ కోసం ముంబయికి వచ్చే ఆటగాళ్లు అందరూ 48 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించింది. ఐపీఎల్ జట్ల కోసం ముంబయిలో 10 హోటల్స్‌ని, పూణేలో2 హోటల్స్ బీసీసీఐ కేటాయించినట్లు తెలిపింది..ఇక ఐపీఎల్ 15వ సీజన్ ప్రాక్టీస్ కోసం జట్లకు 5 మైదానాలను కూడా కేటాయించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దాంతో మార్చి 14 వ తేదీ నుంచి అంటే ఐపీఎల్ ఆరంబానికి 11 రోజుల ముందే అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్స్‌ నిర్వహించుకోవచ్చని వెల్లడించింది.

టోర్నీకి సంబంధించి ముంబైలో 55 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్లే ఆఫ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ 2022 లీగ్ దశలో ముంబైలో 55, పూణేలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు నాలుగు స్టేడియంలలోనే జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డివై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు, పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • ipl teams
  • march 8
  • quarantine mandatory

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd