Harassment: విమానంలో మహిళకు ఊహించని అనుభవం.. ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశ్ వ్యక్తి?
ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ అన్నది కరువవుతోంది. స్త్రీలకు ఇంట బయట ఎక్కడా కూడా స్త్రీలకు రక్షణ అనేది లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా నిత్య
- By Nakshatra Published Date - 04:10 PM, Fri - 8 September 23
ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ అన్నది కరువవుతోంది. స్త్రీలకు ఇంట బయట ఎక్కడా కూడా స్త్రీలకు రక్షణ అనేది లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఆడవారి కోసం ఎన్ని రకాల చట్టాలను తీసుకువచ్చినప్పటికీ వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం కామాంధుల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కామాంధులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా 9 నెలల పసికందు నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఏ ఒక్కరిని విడిచి పెట్టడం లేదు.
ఇంట్లో బయట ఆఫీసులలో వాహనాలలో చివరికి విమానంలో కూడా ఆడవారిపై లైంగిక దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మస్కట్-ఢాకా విమానం ముంబై మీదుగా ప్రయణిస్తున్న క్రమంలో ఒక బంగ్లాదేశీ ప్రయాణికులు మహిళా ఫ్లైట్ అంటెండెంట్ పై లైంగిక వేధింపులకు గురిచేసిన 30 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన మహ్మద్ దులాల్ అనే ప్రయాణికుడు విస్తారా విమానంలో మస్కట్ నుంచి ముంబై మీదుగా ఢాకా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతను మహిళ ఫ్లైట్ అటెండెంట్ తో అనుచితంగా ప్రవర్తించాడు. విమానం ముంబైలో ల్యాండ్ కావడానికి అరగంట ముందు దులాల్ తన సీటు నుంచి లేచి మహిళను కౌగిలించుకున్నాడు.
ఆమెను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇతర క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని తోసేసే ప్రయత్నం చేశాడని అధికారులు తెలిపారు. ఫ్లైట్ కెప్టెన్ వార్నింగ్ ఇచ్చినా సదరు నిందితుడు పట్టించుకోలేదు. ముంబైలో విమానం ల్యాండైన వెంటనే ప్రయాణికుడిని భద్రతా అధికారులకు అప్పగించారు. దులాన్ ని సహర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. మహిళా ఫ్లైట్ అటెండెంట్ ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసులు నమోదు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా శుక్రవారం వరకు పోలీస్ కస్టడీ విధించారు.
Related News
Visakhapatnam: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్
Visakhapatnam: ఎయిర్ ఏషియా విశాఖపట్నం-బ్యాంకాక్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విశాఖపట్నం నుండి విదేశీ విమానాన్ని ప్రవేశపెట్టిన రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థగా నిలిచింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమానం స్కూట్. వారానికి మూడు సార్లు (మంగళ, గురు, శనివారాలు) బ్యాంకాక్ కు ఎయిర్ ఏషియా విమానాలను నడపనుంది. బ్యాంకాక్ ను�