Bangladesh: శాంతించిన బంగ్లాదేశ్, సుప్రీం కీలక నిర్ణయం
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడిన యోధుల బంధువులు, ఇతర వర్గాలకు మిగిలిన 7 శాతం ఉద్యోగాలు మిగిలి ఉండగా, 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను మెరిట్ ఆధారిత విధానంలో కేటాయించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది.
- Author : Praveen Aluthuru
Date : 21-07-2024 - 4:22 IST
Published By : Hashtagu Telugu Desk
Bangladesh: బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుదారుల వివాదాస్పద కోటా విధానాన్ని కోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి రిజర్వేషన్ కోటా దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. యువత రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. రిజర్వేషన్ కోటాని తీసివేయాల్సిందిగా నినదించారు. ఈ క్రమంలో అక్కడ అశాంతి నెలకొంది. యువత రోడ్లపైకి వచ్చి రాళ్లతో అలజడి రేపారు. ఈ క్రమంలో పోలీసులు మరియు నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నిరసనకాండలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఎంతో మంది గాయాలబారీన పడ్డారు.(Bangladesh)
30 శాతం కోటా నిర్ణయం రద్దు:
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడిన యోధుల బంధువులు, ఇతర వర్గాలకు మిగిలిన 7 శాతం ఉద్యోగాలు మిగిలి ఉండగా, 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను మెరిట్ ఆధారిత విధానంలో కేటాయించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది. అంతకుముందు ఈ వ్యవస్థ ఉద్యోగాలలో 30 శాతం యుద్ధ అనుభవజ్ఞుల బంధువుల కోసం రిజర్వు చేసింది.కాగా ఈ కోటాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి, ఈ రిజర్వేషన్ను నిలిపివేయాలని వేళా సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేశారు.(Student Protest)
చూడగానే కాల్చమని ఆదేశాలు:
మంగళవారం నిరసనకారులు మరియు పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు ఘోరంగా మారాయి. వీధులు మరియు యూనివర్సిటీ క్యాంపస్లపై రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు మరియు పొగ గ్రెనేడ్లను విసిరారు. హింసాకాండను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దేశం మొత్తం కర్ఫ్యూ విధించింది. ఎవరైనా నిరసనకారులను కనపడితే కాల్చివేయాలని పోలీసులను ఆదేశించింది.(Reservation)
135 మంది ప్రాణాలు కోల్పోయారు:
బంగ్లాదేశ్ అధికారులు చనిపోయిన మరియు గాయపడిన వారి అధికారిక లెక్కలను ఇంకా వెల్లడించలేదు. వార్తాపత్రిక గణాంకాల ప్రకారం హింసాత్మక నిరసనలలో ఇప్పటివరకు కనీసం 135 మంది మరణించారు.
Also Read: Hyderabad: రీల్స్ కోసం బైక్ స్టంట్ , యువకుడు మృతి