Women: ఆడవారిలో గడ్డాలు, మీసాలు రావడానికి కారణం ఆ సమస్యలా.. వాటిని ఎలా తొలగించాలంటే?
ఇక ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దొరికే ఆహార పదార్థాలు అటువంటివి కాబట్టి. ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- By Nakshatra Published Date - 07:42 PM, Mon - 17 April 23
Women: ఇక ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దొరికే ఆహార పదార్థాలు అటువంటివి కాబట్టి. ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో బయటికి రావాలన్నా కూడా భయపడుతున్నారు. అందులో ఒకటి వారిలో అబ్బాయి లక్షణాలు రావడం. అంటే చెంపలపై, మూతిపై.. గడ్డాలు, మీసాలు లాగా వెంట్రుకలు రావడం.
అయితే ఇవి రావడానికి కారణం కొన్ని అనారోగ్య సమస్యలు అని చెప్పాలి. అయితే స్త్రీలలో మీసాలు, గడ్డాలు పెరగటాన్ని హిర్సుటిజం అని అంటారు. అంటే హార్మోన్ల అస్తవ్యస్తం కారణంగా స్త్రీలకు ఇలా వెంట్రుకలు పెరుగుతుంటాయి. శరీరంలో కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్, పిట్యూటరీ, థైరాయిడ్ వంటి గ్రంథాల హార్మోన్ వ్యవస్థలో లోపాలు, పురుష హార్మోన్ స్థాయిలు పెరిగిన సందర్భంలో ఇటువంటివి తలెత్తుతాయి.
అంతేకాకుండా కొన్ని రకాల మందులు వాడటం వల్ల, స్టెరాయిడ్స్ వల్ల ఇలా వెంట్రుకలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ సమస్య వల్ల చాలామంది అమ్మాయిలు బయట తిరగాలన్న కాస్త ఇబ్బంది పడుతున్నారు. వీటిని ఎలా తొలగించాలి అంటూ చాలా బాధపడుతున్నారు. అయితే వీటిని ఎటువంటి మెడిసిన్స్ కాకుండా కొన్ని ఇంటి చిట్కాలు ద్వారా తొలగించవచ్చని తెలుస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏంటో చూద్దాం..
ఒక స్పూన్ నిమ్మరసంలో.. స్పూన్ పంచదారని వేసి బాగా కలిపి ఆ రసాన్ని పెదవి పై భాగంలో రాసి సుమారు అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇక వెంటనే రోజు వాటర్ రాయాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక పసుపులో కొద్ది మోతాదులో నీళ్లు పోసి మెత్తగా చేసి రోమాలు ఉన్న పెదవి పై అప్లై చేసి గంట పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక నెల రోజులు చేస్తే సమస్య తొలగిపోతుంది.
గుడ్డు తెల్లచీనలో కొంచెం మొక్కజొన్న పిండి, పంచదార కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ బంగాళదుంప రసం తీసుకుని అందులో అర స్పూన్ మైదాపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఇక శనగపిండిలో కొంచెం నీళ్లు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇక ఆరిన తర్వాత చేతివేళ్లతో మళ్ళీ నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేయటం వల్ల రోమాలు తొలగిపోతాయి.
Related News
Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.