KCR:వీహెచ్పీ వాళ్ళు.. ఢిల్లీ పోలీసులపై యుద్ధం ప్రకటిస్తారా – కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కేటీఆర్ ప్రశ్నలు
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) పై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
- By Hashtag U Published Date - 01:30 PM, Tue - 19 April 22
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) పై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జహంగీర్ పురిలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలతో సంబంధం ఉన్న వీహెచ్పీ కార్యకర్తలను ఆ సంస్థ వెనకేసుకు రావడాన్ని ఆయన తప్పుపట్టారు. వీహెచ్పీ కార్యకర్తలపై ఏవైనా చర్యలు తీసుకుంటే .. ఢిల్లీ పోలీసులపై యుద్ధాన్ని ప్రకటిస్తామని వీహెచ్పీ నాయకత్వం హెచ్చరికలు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. వీహెచ్పీ అనేది.. మన దేశ అత్యున్నత చట్టాల కంటే పెద్దదా ?
చట్టాలకు అతీతమైందా ? అని ప్రశ్నించారు. ‘ ఢిల్లీ పోలీసులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వీహెచ్పీ ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు ? ‘అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను ఆయన నిలదీశారు. ‘ నేరుగా మీ పరిధిలో పనిచేసే ఢిల్లీ పోలీసులపై వీహెచ్పీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే .. ఎందుకు ఊరుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలోని జహంగీర్ పురిలో వీహెచ్పీ .. పోలీసుల అనుమతులు తీసుకోకుండానే హనుమాన్ శోభాయాత్ర నిర్వహించింది. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు , ఒక వీహెచ్పీ నాయకుడిని కూడా అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులను టార్గెట్ చేస్తూ పలువురు వీహెచ్పీ నేతలు వ్యాఖ్యలు చేశారు.
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ