Ex MP Kothapalli Geetha : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది. పీఎన్బీ నుంచి రూ.52 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో గీత
- By Prasad Published Date - 01:52 PM, Wed - 14 September 22
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది. పీఎన్బీ నుంచి రూ.52 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో గీత అరెస్టయ్యారు. హైదరాబాద్లో గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లారు. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో గీత దంపతులు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. అయితే రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న డబ్బుని దారి మళ్లించారనే అభియోగాలతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
Related News
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుంది.