AP Govt : పాత, కొత్త మంత్రులతో ‘తేనీటి విందు’
ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం
- By Balu J Published Date - 05:04 PM, Sat - 9 April 22
ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మార్పులు ఉంటాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందరూ అనుకున్నట్టు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు మంత్రులు రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి జగన్ ఆమోదించడం, ఆ తర్వాత గవర్నర్ కు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే కొత్త మంత్రివర్గం రూపుద్దిద్దుకుంటున్న నేపథ్యంలో ఈనెల 11 న పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు ఉంటుందని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపామని, Aa, A1, A2, B1, b2 కేటగిరీలుగా పాసులు జారీ చేశామని ఏపీ సీఎంవో ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేసింది.
Related News
AP TDP: జగన్ ని ఓడిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్
AP TDP: ఈనెల పదమూడవ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా నూజివీడు నియోజకవర్గ టీడీపి,జానసేనా,బీజేపీ పార్టీ లా ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ ,ఎంఎల్ఏ అభ్యర్థులు పుట్టా మహేష్ యాదవ్ ,k.p.సారథితో పాటు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు గోల్లవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ గ్రామా�