Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి
కర్నాటకలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది.
- By Sudheer Published Date - 08:20 PM, Sat - 25 March 23
![Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/03/KARNATAKA.jpg)
కర్నాటకలో (Karnataka) మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (pm modi)పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది. మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి. ప్రధాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దావణగెరెలో జరిగింది. రోడ్ షోలో వెళ్తున్న ప్రధానమంత్రి మోదీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం గుమిగూడారు. ఇంతలో ఓ వ్యక్తి తోసుకుంటూ వచ్చి ప్రధాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాదాపు ప్రధాని కారు దగ్గరకు చేరుకోగానే…భద్రతా బలగాలు అతన్ని అడ్డుకున్నాయి.
VIDEO: पंतप्रधान मोदींच्या सुरक्षेत पुन्हा एकदा चूक, एक तरुण मोदींच्या दिशेनं धावत आला अन्…https://t.co/xspcfGyAF8
— Lokmat (@lokmat) March 25, 2023
అంతకుముందు జనవరిలో కర్నాటకలో హుబ్లీలో ప్రధానిమోదీ రోడ్ షో జరిగినప్పుడు కూడా ఓ చిన్నారి ప్రధానికి దగ్గరగా వచ్చాడు. ఆరో తరగతి చదువుతున్న చిన్నారి ప్రధాని మోదీకి పూలమాల వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న ఎస్పీజీ జవాన్లు పిల్లాడిని అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రధానమంత్రి భద్రతలోపాన్ని చూపాయి. అయితే కర్నాటక పోలీసులు దీనిని భద్రతాలోపంగా పేర్కొనలేదు.
Related News
![Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/boy.jpg)
Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.