TTD: శ్రీవారి చెంతన ‘శ్రీనివాస సేతు’ ఫ్లైఓవర్!
కేంద్ర ప్రభుత్వ నిధులతో చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
- By Balu J Published Date - 02:40 PM, Mon - 31 January 22
కేంద్ర ప్రభుత్వ నిధులతో చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించే లక్ష్యంతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మిస్తున్నారు. శ్రీనివాస సేతు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఫిబ్రవరి తొలి వారంలో ఈ ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.
శ్రీనివాస సేతు తొలిదశలో బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాస వసతి సముదాయం నుంచి కపిల తీర్థం వద్ద ఉన్న నంది సర్కిల్ వరకు సుమారు 3 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. మరోవైపు తిరుపతి బస్టాండు నుంచి తిరుచానూరు హస్తకళారామం వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు రెండో దశ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తిరుపతి స్మార్ట్ సిటీ నిధులను కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. రెండవ దశ పనులు మరో ఆరునెలల్లో పూర్తి కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
Tags
Related News
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్ల వివరాలు ఇదిగో
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి, శ్రీవారి సేవ కోసం ఆన్లైన్ కోటా విడుదల వివరాలను ప్రకటించింది. టిటిడి అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా భక్తులు తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం […]