Anand Mahendra:మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న చిన్నారి ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
- By Hashtag U Published Date - 02:48 PM, Mon - 29 August 22
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచూ ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజా అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ముఖ్యంగా ప్రతిభను వెలుగులోకి తేవడంలో ఆయనది అందెవేసిన చేయి. తాజాగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో ట్రెండ్ అవుతోంది.
His hands move with the fluency of a great sculptor. 👏🏽👏🏽👏🏽 I wonder if kids like him get the training they deserve or have to abandon their talent…? https://t.co/XzMgeg930q
— anand mahindra (@anandmahindra) August 28, 2022
ఓ చిన్న పిల్లాడు చేతితో మట్టి వినాయకుడి ప్రతిమను తయారు చేస్తున్న వీడియోను ఆనంద్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో సదరు చిన్నారి చాలా ఒడుపుగా, జాగ్రత్తగా వినాయకుడి ప్రతిమను తీర్చిదిద్దాడు. తన చిట్టి చేతులతో గణనాధుడి తొండానికి ఆకారం తెస్తున్న ఈ క్లిప్ లో అతను ఎంతో నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్ ఆర్టిస్టు మాదిరిగా శిల్పాన్ని రూపొందిస్తున్నట్లుగా అనిపించింది.
‘అతని చేతులు గొప్ప శిల్పి మాదిరిగా కదులుతున్నాయి. ఇలాంటి చిన్నారులకు తగిన శిక్షణ ఇవ్వాలా? లేక వారి ప్రతిభను వదులుకోవాలా? అనేది అర్థకావడం లేదు’ అని మహీంద్ర ట్వీట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే ఐదు లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. అయితే, ఆనంద్ మహీంద్ర ట్వీట్ పై మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. కొంత మంది ఆ చిన్నారితో చాలా ప్రతిభ ఉందని, దాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనంద్ ను పొగుడుతున్నారు. మరికొందరు మాత్రం మహీంద్రా లాంటి వ్యక్తి బాలుడి వీడియోను పోస్ట్ చేసి బాల కార్మికులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని పెదవి విరిచారు.
Related News
Viral Video: సమ్మర్ ఎఫెక్ట్.. స్విమ్మింగ్ పూల్గా మారిన క్లాస్రూం, వీడియో వైరల్
Viral Video: పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థుల హాజరు కోసం తరగతి గదిని స్విమ్మింగ్ పూల్ గా మార్చారు టీర్లు. కొందరు పిల్లలు తరగతి గదిలోని ఒక మూల నుంచి మరో మూలకు ఈత కొడుతూ కేరింతలు చేస్తుండగా, మరికొందరు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్న వీడియో ఒకటి ట్విటర్లో చక్కర్లు కొడుతోంది. పంట కోతలు, వడగాల్పుల కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నంద