‘Acharya’ Loss: ఆచార్య.. ఆదుకోండి ప్లీజ్ !
మెగాస్టార్ చిరంజీవికి లేఖ రాస్తూ.. ‘ఆచార్య’ వల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని వేడుకున్నాడు.
- By Balu J Published Date - 11:43 PM, Sat - 7 May 22
రాజ్గోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ మెగాస్టార్ చిరంజీవికి లేఖ రాస్తూ.. ‘ఆచార్య’ వల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని వేడుకున్నాడు. ఇటీవల విడుదల ఆచార్య సినిమాను ఓ ఏరియాలో పెట్టుబడి పెట్టిన డబ్బులో 75 శాతం నష్టపోయామని డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నాడు, చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ మిగిల్చిన భారీ నష్టాల లోటును పూడ్చాలని కోరారు. చిరు-రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ కారణంగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా పంపిణీ హక్కులను పొందేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బజాజ్ వరంగల్ శ్రీనుకి ప్రీమియం చెల్లించారు.
ఈ సందర్భంగా చిరంజీవికి లేఖ రాశాడు. ‘ఆచార్య’ చిత్రం ఫలితంపై డిస్ట్రిబ్యూటర్లు కలవరపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. “నేను ఇప్పుడు చాలా అప్పుల్లో ఉన్నాను” అన్నారాయన. ఈ లేఖ మొత్తం పరిస్థితికి ప్రతినిధి కాకపోవచ్చు కానీ దాదాపు అన్ని చోట్లా ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూటర్లు 60 శాతం వరకు నష్టపోయారన్నది నిర్వివాదాంశం. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చిరంజీవి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�