Karnataka: కాబోయే భర్తని రీల్స్ చేద్దామని పిలిచిన యువతి.. కానీ చివరికి?
ఈ మధ్యకాలంలో చాలామంది యువత తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ ఊహించని
- By Nakshatra Published Date - 02:48 PM, Sun - 9 April 23
ఈ మధ్యకాలంలో చాలామంది యువత తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ ఊహించని నిర్ణయాల వల్ల కొంతమంది వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మరి కొంతమంది తల్లిదండ్రుల మర్యాదలను తీసి వారి ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతున్నారు. ఇంకొంతమంది యువత తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని బాధని మిగులుస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక యువతీ కాబోయే భర్తని రీల్స్ చేద్దామని పిలిచి కాబోయే భర్త పై దారుణానికి ఒడిగట్టింది. అసలేం జరిగిందంటే.. ఒక 17 ఏళ్ల బాలిక తను ప్రేమిస్తున్న యువకుడిని కాదని మరో జోకుడితో వివాహం చేసుకోవడానికి ఇష్టం లేక తనకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడి బలవంతం మీదకు దేవేంద్ర గౌడ అనే 23 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థానికి ఓకే చెప్పింది. గత నెల మార్చి మూడవ తేదీన వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇకపోతే ఆ బాలిక ఎలా అయిన దేవేంద్ర అడ్డు తొలగించుకొని తాను ప్రేమిస్తున్న యువకుడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ మేరకు పక్కాగా ప్లాన్ కూడా వేసుకుంది.
ఇక తాజాగా ఆ బాలిక దేవేంద్రకు ఫోన్ చేసి ఉద్యానానికి వస్తే రీల్స్ తీసుకుందామని చెప్పడంతో ఆ బాలిక మాటలు నిజమని నమ్మిన దేవేంద్ర అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి కొన్ని రీల్స్ చేశారు. ఆ తర్వాత మరొక రీల్ చేస్తానని చెప్పి ఆ యువకుడి చేతులు గట్టిగా కట్టేసింది. అందుకు దేవేంద్ర కూడా సరే అని అన్నాడు. చేతులు కట్టేసిన యువతి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని అతని గొంతుపై పొడిచి అక్కడి నుంచి పరారయింది. ఆ తర్వాత ఎట్టకేలకు చికిత్స నిమిత్తం దేవేంద్రను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా బాధితుడు దేవేంద్ర హరపనహళ్లిలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే బాలిక మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకునే విధంగా ఆమె తల్లిదండ్రులు ఒప్పించి దేవేంద్ర తో గత నెల మార్చి 3న నిశ్చితార్థం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Related News
Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.