IndiGo : ఇండిగో ఫ్లైట్కు తృటిలో తప్పిన ప్రమాదం, శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్
- By hashtagu Published Date - 09:55 AM, Tue - 4 April 23
బెంగుళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈవిమానం బెంగళూరు నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. విమానంలో(6E897)లో 137 మంది ప్రయాణికులు ఉన్నారు.
సాంకేతిక లోపం కారణంగా ఈరోజు ఉదయం 6.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. బెంగళూరు నుండి విమానం బయలుదేరిన కొంతసేపటికి, దానిలో సాంకేతిక సమస్య గుర్తించి పైలట్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
Varanasi-bound IndiGo Flight (6E897) from Bengaluru having 137 passengers onboard made an emergency landing, due to a technical problem, at Shamshabad Airport in Telangana at 6.15 am today morning. All passengers are safe: DGCA pic.twitter.com/pblZR2op5l
— ANI (@ANI) April 4, 2023
Related News
Leopard : హమ్మయ్య..’చిరుత’ చిక్కింది
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అది బోనులో చిక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు