Ladakh: లడఖ్లో ప్రమాదానికి గురైన ఆర్మీ వాహనం: 9 మంది మృతి
లడఖ్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. 10 మంది ఆర్మీ అధికారులు లేహ్ నుండి న్యోమాకు వెళుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలో పడిపోయింది.
- By Praveen Aluthuru Published Date - 11:02 AM, Sun - 20 August 23
Ladakh: లడఖ్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. 10 మంది ఆర్మీ అధికారులు లేహ్ నుండి న్యోమాకు వెళుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది సైనికులు మరణించారు. ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలలోకి వెళితే..
శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 10 మంది ఆర్మీ జవాన్లు లేహ్ నుండి న్యోమాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపాడు. టర్న్ తీసుకునే క్రమంలో వాహనం కంట్రోల్ కాకపోవడంతో అదుపుతూ తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బటయపడ్డాడు. అయితే తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్తున్నారు. లడఖ్లోని నియోమాలోని కియారీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సైనికుడిని ఆర్మీ మెడికల్ ఫెసిలిటీకి తరలించారు.
Also Read: World Mosquito Day: దోమలపై యుద్ధానికి తొలి అడుగు సికింద్రాబాద్ నుంచే.. తెలుసా ?
Related News
Rayapati Aruna : ప్రమాదానికి గురైన రాయపాటి అరుణ..జనసేన శ్రేణుల్లో ఆందోళన
ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి