Massive Fire In Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire In Maharashtra) చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
- By Gopichand Published Date - 08:59 AM, Sun - 31 December 23
Massive Fire In Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire In Maharashtra) చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీ యాజమాన్యం చాలా నష్టపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారని సమాచారం. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటన ఛత్రపతి శంభాజీనగర్లోని గ్లోవ్ల తయారీ కంపెనీలో చోటుచేసుకుంది. ఈ కంపెనీ నుంచి అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు కంపెనీలో కొందరు నిద్రిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు తప్పించుకోగా, మరికొందరు లోపల ఉండిపోయారని స్థానికులు చెప్పారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా వారు బయటకు రాలేకపోవడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారని చెప్పారు.
Also Read: Giorgia Meloni: ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా జార్జియా మెలోని.. అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళలు..!
కంపెనీ లోపల 15 మంది..
ఫ్యాక్టరీలో 10-15 మంది నిద్రిస్తున్నారని కంపెనీ నుంచి బయటకు వచ్చిన కార్మికులు చెబుతున్నారు. కంపెనీలో చిక్కుకున్న వారిలో భుల్లా షేక్ (65), కౌసర్ షేక్ (26), ఇక్బాల్ షేక్ (26), మగ్రూఫ్ షేక్ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో 6 మంది మృతి చెందారని, మంటల్లో కాలిపోయిన వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
మంటలను అదుపు చేసిన అగ్నిమాపక శాఖ బృందం ఇప్పుడు ఈ సంఘటనకు అసలు కారణాన్ని కనుగొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కంపెనీలో మంటలు చెలరేగినప్పుడు లోపల చిక్కుకున్న వ్యక్తులు సహాయం కోసం అభ్యర్థించారు. వారి శబ్దం విన్న చుట్టుపక్కల వారు మేల్కొని సంఘటనా స్థలానికి చేరుకుని కొందర్ని కాపాడారు. ఈ సమయంలో అగ్నిమాపక శాఖ, స్థానిక ప్రజలు వారిని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే కొంతమంది ప్రాణాలతో బయటపడగా, ఆరుగురు సజీవ దహనమయ్యారు.
Tags
Related News
Shadnagar Fire: షాద్ నగర్ అగ్ని ప్రమాదంలో 50 మందిని తాడు సహాయంతో కాపాడిన బాలుడు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది సిబ్బంది చిక్కుకున్నారు. మంటలు భయంకరంగా ఎగసిపడుతుండగా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.