50 Students Hospitalised: ఫుడ్ పాయిజనింగ్తో 50 మంది విద్యార్థులకు అస్వస్థత
తెలంగాణలోని కుమురభీం-ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు
- By Balu J Published Date - 12:54 PM, Tue - 20 September 22
తెలంగాణలోని కుమురభీం-ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. హాస్టల్లో రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ అధికారులు గత మూడు రోజులుగా నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని, బియ్యంలో చిన్న పురుగులు ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. సంక్షేమ పాఠశాలల్లో ఫుడ్పాయిజన్ కేసులు పెరిగిపోతున్నాయని, ఇటీవల కాగజ్నగర్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో కలుషిత ఆహారం కారణంగా ఓ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే.
Related News
Pratibha Patil Hospitalised : హాస్పటల్ లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్..
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురికావడం తో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిభా పాటిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నా�