4 Lost Life-Muharram : మొహర్రం ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురి మృతి
4 Lost Life-Muharram : జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మొహర్రం ఊరేగింపునకు సిద్ధమవుతున్న సమయంలో మతపరమైన జెండాకు విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలింది.
- By Pasha Published Date - 10:58 AM, Sat - 29 July 23
4 Lost Life-Muharram : జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
మొహర్రం ఊరేగింపునకు సిద్ధమవుతున్న సమయంలో మతపరమైన జెండాకు విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలింది.
దీంతో కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యక్తులు మరణించగా, 10 మంది గాయపడ్డారు.
Also read : International Tiger Day 2023 : ది టైగర్.. మన జాతీయ జంతువును కాపాడుకుందాం!
జార్ఖండ్లోని పెతర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖెత్కో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇనుముతో చేసిన మతపరమైన జెండా.. 11,000 వోల్ట్ హై-టెన్షన్ వైర్కు తగిలడంతో కరెంట్ షాక్ కొట్టిందని బొకారో జిల్లా ఎస్పీ ప్రియదర్శి అలోక్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందన్నారు. గాయపడిన 10 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. నలుగురు చికిత్సపొందుతూ చనిపోయారు. ఇంకో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Also read :New Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆగస్టులో పలు కంపెనీల కొత్త కార్లు విడుదల..!
Related News
Jharkhand: జార్ఖండ్ మంత్రికి సంబంధించి రూ.35.23 కోట్లు స్వాధీనం.. ఈడీ విచారణ
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్ మరియు అతనితో సంబంధం ఉన్న వ్యక్తులపై జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడిలో మొత్తం రూ. 35 కోట్ల 23 లక్షలు వెలుగు చూశాయి.