Bihar Accident: బీహార్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
బీహార్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 04:01 PM, Sat - 19 August 23
Bihar Accident: బీహార్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీహార్లోని పూర్నియా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. పూర్నియాలోని కృత్యానంద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇథనాల్ ఫ్యాక్టరీ సమీపంలో బస్సు, ఆటోరిక్షా ఢీకొన్నాయి. గాయపడ్డ వారిలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. భూ వివాదం కేసులో తాను పూర్ణియా కోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాయని ఆ వ్యక్తి తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ పూర్ణియా మెడికల్ కాలేజీలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
Also Read: Jailer Box Office: కేరళలో రజనీ హవా, విక్రమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైలర్,
Related News
Bihar : అయ్యో అని అల్లుడ్ని చేరదీస్తే..అత్తానే లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నాడు
పిల్లలు పుట్టిన తర్వాత సికందర్ యాదవ్ భార్య చనిపోయింది. దీంతో సికందర్ యాదవ్ను, ఇద్దరు పిల్లలను.. అత్తామామలు గీతాదేవి, దిలీశ్వర్ దార్వే తీసుకువచ్చి తమ ఇంట్లో ఉంచుకున్నారు