Covid19: 29 జిల్లాల్లో జీరో కరోనా కేసులు
తెలంగాణలో ఆదివారం 21 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
- By Balu J Published Date - 03:49 PM, Mon - 25 April 22
తెలంగాణలో ఆదివారం 21 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 17 హైదరాబాద్లో ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.06%. ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,91,793కి చేరుకుంది. మొత్తం 19 మంది రోగులు కోలుకున్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 213 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 99.45% కాగా, మరణాల రేటు 0.51%. ఆదివారం మొత్తం 10,132 నమూనాలను పరీక్షించారు. హైదరాబాద్, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ మినహా మిగిలిన 29 జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి.
Related News
Shocking News for Non-Veg Lovers : హైదరాబాద్ లో చికెన్ , మటన్ షాప్స్ బంద్
ఈ ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ వెజ్ షాప్స్ క్లోజ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా ఓపెన్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు