Tamil Nadu : తమిళనాడులో జల్లికట్టులో విషాదం.. ఎద్దు పొడవడంతో 14 ఏళ్ల బాలుడు మృతి
తమిళనాడులో జల్లికట్టు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని ఎద్దు ఢీకొట్టడంతో మరణించాడు.
- By Prasad Published Date - 09:08 AM, Sun - 22 January 23
తమిళనాడులో జల్లికట్టు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని ఎద్దు ఢీకొట్టడంతో మరణించాడు. తమిళనాడులోని ధర్మపురిలో జల్లికట్టు క్రీడను తిలకించేందుకు వచ్చిన 14 ఏళ్ల బాలుడు గోకుల్ ని ఎద్దు పొడిచింది. ఘటన జరిగినప్పుడు గోకుల్ తన బంధువులతో కలిసి జల్లికట్టు చూసేందుకు వెళ్లాడు. ఎద్దు పొట్టలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గోకుల్ను వెంటనే ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోకుల్ ఎలా గాయపడ్డాడో తెలుసుకోవడానికి సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది జల్లికట్టులో నలుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Related News
Driving License: రెండు చేతులు కోల్పోయిన యువకుడికి లైసెన్స్
రెండు చేతులు కోల్పోయిన తమిళనాడు యువకుడు కారు నడిపేందుకు లైసెన్స్ పొంది రికార్డు సృష్టించాడు. తాన్సేన్ (31) చెన్నై వ్యాసర్పాడి పెరియార్కు చెందినవాడు. పదేళ్ల వయసులో విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. పట్టుదలతో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతనికి వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది.