Famous Tree: చెట్టుని నరికేస్తే అరెస్ట్ చేస్తారా? ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చెట్టును నరికివేసినందుకు పోలీసులు 16 ఏళ్ళ బాలుడిని అరెస్టు చేసిన ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా చెట్లను నరకాలంటే అది కూడా బహిరంగ ప్రదేశంలో ఉన్న చెట్టును నరికివేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.
- By Praveen Aluthuru Published Date - 04:05 PM, Sat - 30 September 23
Famous Tree: చెట్టును నరికివేసినందుకు పోలీసులు 16 ఏళ్ళ బాలుడిని అరెస్టు చేసిన ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా చెట్లను నరకాలంటే అది కూడా బహిరంగ ప్రదేశంలో ఉన్న చెట్టును నరికివేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. లేదంటే జరిమానా విధిస్తారు. ఇంగ్లాండ్లో ప్రసిద్ధి చెందిన చెట్టుని నరికివేసిన కారణంగా బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ చెట్టు దాదాపు 300 ఏళ్ల నాటిది. దీంతో ఆ ప్రదేశంలో ప్రత్యేకత సంతరించుకుంది. అది రెండు కొండల మధ్య ఏళ్ళ నుంచి దృఢంగా ఉన్నది . ఆ చెట్టును చూసేందుకు ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు. 300 ఏళ్ళ నాటి చెట్టుని 16 ఏళ్ల బాలుడు రాత్రికి రాత్రే మాయం చేశాడు.
ఇంగ్లండ్లోని నార్తంబర్ల్యాండ్లోని చారిత్రాత్మక హెండ్రియన్ వాల్ వద్ద ఈ చెట్టు ఉంది. సైకమూర్ గ్యాప్లో అందంగా కనిపిస్తుంది. ఇది ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెండు కొండల మధ్యలో ఒకే ఒక్క భారీ చెట్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెండ్రియన్ వద్దకు చాలా మంది సందర్శకులు వస్తుంటారు. ఈ చెట్టు పట్ల చాలా ఆకర్షితులయ్యారు. చెట్టు వద్ద సందర్శకులు ఫోటోలు మరియు వీడియోలు తీసుకునేవారు.
1900లో రోమన్ల కాలంలో రోమన్లు ఈ చెట్టును నాటారు. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న చెట్టుని నేలకూల్చడం పర్యావరణవేత్తలకు ఆగ్రహం తెప్పించింది. చెట్టును రాత్రికి రాత్రే నరికివేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చెట్టును నరికిన వారెవరో తెలుసుకున్నారు. ఈ పురాతన చెట్టును 16 ఏళ్ల బాలుడు నరికేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. దాంతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ చెట్టును ఎందుకు నరికాడు? నరకానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఇంత తక్కువ సమయంలో రాత్రి ఎందుకు నరికేశాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ చెట్టును నరికిన నేరంలో అతడికి జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నారు ఇది 2016లో ఇంగ్లిష్ ట్రీ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. సైకమోర్ గ్యాప్ ప్రాంతాన్ని పర్యవేక్షించే హెరిటేజ్ స్వచ్ఛంద సంస్థ నేషనల్ ట్రస్ట్ చెట్టును నరికివేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Also Read: Turmeric : అజీర్ణానికి పసుపుతో కళ్లెం వేయొచ్చా..!
Related News
Siddaramaiah: ప్రజ్వల్ రేవణ్ణ ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేస్తా
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఏ దేశంలో ఉన్నా సరే అరెస్ట్ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరాఖండిగా చెప్పారు.