Centre vs Telangana: బీజేపీ బట్టెబాజ్ గాళ్ళు తెలంగాణను ఇబ్బంది పెడుతున్నారు
- By Hashtag U Published Date - 11:48 AM, Sun - 12 December 21
బీజేపీని వరిధాన్యం అంశంలో మొన్నటిదాకా విమర్శించిన టీఆర్ఎస్ నాయకులు తాజాగా బొగ్గుగనుల అంశంపై బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీ బట్టెబాజ్ గాళ్లు ప్రతి అంశంలో తెలంగాణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని గూలాబీనేతలు ఆరోపించారు.
మొన్నటిదాకా జీఎస్టీ చెల్లింపుల విషయంలో, నిన్న ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చే విషయంలో తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపించిన కేంద్రం తాజాగా సింగరేణిపై కక్ష కట్టిందని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో ప్రముఖపాత్ర పోషిస్తున్న సింగరేణిపై బీజేపీ కన్నుపడి కుట్రలకు పాల్పడుతోందని, దానిలో భాగంగానే నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేసే ఆలోచన చేస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం తెస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలకు తాము మొదటినుండి వ్యతరేకమని కేంద్రానికి వ్యతిరేకంగా చేసిన అనేక కార్యక్రమాల్లో తాము కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నామని గుర్తు చేశారు.
బొగ్గు బ్లాకులను వేలం వేయోద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని, కానీ కేంద్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. గుజరాత్లో మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్కు లిగ్నైట్ బ్లాకులను వేలం లేకుండా అప్పగించారని, తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ప్రభుత్వానికి అప్పగించమని కోరితే మాత్రం ఒప్పుకోవట్లేదని, గుజరాత్ కు ఒక నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన ప్రశ్నించారు. మోదీ తన మిత్రులైన అదానీకి బొగ్గు బ్లాకులను అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాల్క సుమన్ హెచ్చరించారు.
Related News
SCCL: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్/ నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 272 ఖాళీలు భర్తీ కానున్నాయి. మార్చి 1 నుంచి 18లోపు దరఖాస్తు చేసుకోవాలి. We’re now on WhatsApp. Click to Join. ప్రకటన వివరాలు: I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు 1. మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ2 గ్రేడ్: 139 పోస్టులు 2