Tribal Village: ఆనంద్ మహీంద్రా మనస్సుదోచిన ఆ చిన్న గిరిజన గ్రామం..!!
కేరళ...తేయాకు తోటలకు ప్రసిద్ధి. వేనాడ్ లోని కొండ ప్రాంతాల అందాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చుట్టూ ఉండే కొండల మధ్య కేరళ పర్యాటక విభాగం కొన్ని గిరిజన గూడాలను నిర్మించింది.
- By hashtagu Published Date - 02:18 PM, Fri - 22 July 22
కేరళ…తేయాకు తోటలకు ప్రసిద్ధి. వేనాడ్ లోని కొండ ప్రాంతాల అందాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చుట్టూ ఉండే కొండల మధ్య కేరళ పర్యాటక విభాగం కొన్ని గిరిజన గూడాలను నిర్మించింది. ఈ గూడాలతో పర్యాటకలును ఆకర్షించాలన్నది ఓ ప్రయత్నం. ఈ గ్రామానికి ఎన్నోర్ అనే పేరు కూడా పెట్టారు. కొండల మధ్య 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రామం ఉంటుంది. గిరిజనుల ఇళ్లు ఎలా ఉంటాయి…జీవన విధానాన్ని పరిచయం చేడయమే..ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీంతో పర్యాటకులకు భిన్నమైన అనుభవం లభించనుంది.
2010లో అప్పటి సబ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. గత నెలలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యింది. స్థానిక గిరిజన తెగలతోనే దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు అందాలు ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో దీన్ని షేర్ చేశారు. ఇది చాలా అందంగా ఉంది. కేరళ టూరిజమ్ కు ధన్యవాదాలు ఈ గ్రామం సహజ నిర్మాణ రూపకల్పన చాలా అద్భుతంగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
This is just beautiful. Kudos to @KeralaTourism for this concept. The pristine architectural design of the village is stunning. Showcases how ‘simplicity’ can be stunning. pic.twitter.com/8Wf8CLgoZ2
— anand mahindra (@anandmahindra) July 19, 2022
Related News
Kerala: కేరళ లో వెరైటీ ఫెస్టివల్.. మగోళ్లు ఆడవాళ్లుగా మారి!
Kerala: ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కేరళకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ జరిగే పూజలు, వ్యవహరాలు చాలా భిన్నంగా ఉంటాయి. పురుషులు తమ వేషధారణ మార్చి మహిళలు సైతం కుళ్ళుకునేలా అందంగా తయారవడం ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. కేరళలోని కొల్లం లో ఉన్న కొట్టన్కులంగర శ్రీ దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే చమయంవిళక్కు ఉత్సవం జరుగుతుంది. పురుషులు తమ మీసాలు తీయడం, చీర�