Wife Attacks Husband: పర స్త్రీతో వివాహేతర సంబంధం.. భర్త మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య!!
తన భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తమిళనాడులోని రాణిపేట జిల్లా కావేరిపాక్కంకు చెందిన టి.
- By Hashtag U Published Date - 02:52 PM, Thu - 18 August 22
ఆమె ఎందుకో అర్ధరాత్రి నిద్ర లేచింది.
స్టవ్పై ఓ గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసింది.
బాగా మరిగిన తర్వాత.. ఆ వేడి నీటిని తీసుకొని భర్త మర్మాంగాలపై పోసింది.
మరుగుతున్న నీరు పడడంతో శరీర భాగాలు కాలిపోయాయి.
ఎందుకు ఇలా చేసింది? భర్తపై ఆ మహిళలకు ఎందుకు కోపం? అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే!!
తన భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తమిళనాడులోని రాణిపేట జిల్లా కావేరిపాక్కంకు చెందిన టి. ప్రియ (29) ఈ దారుణానికి పాల్పడింది. ఆమె మరుగుతున్న నీరు పోయడంతో భర్త ఎల్. తంగరాజ్ (32) మర్మాంగాలు కాలిపోయాయి.
తీవ్ర గాయాలతో అతడు కొట్టుమిట్టాడుతున్నాడు.కావేరిపాక్కం పోలీసులు తంగరాజ్ భార్య ప్రియను అరెస్ట్ చేశారు. తన భర్త వేరొక మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతోనే ఇలా చేశానని ప్రియ తన నేరాన్ని అంగీకరించింది. క్షణికావేశంలో అది జరిగిపోయిందని తెలిపింది.
కారణం ఇది..
ప్రియ, తంగరాజ్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. తంగరాజ్ శ్రీపెరంబుదూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన పనిచేస్తున్నాడు. వీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. కానీ కొన్ని రోజులుగా తంగరాజ్ ప్రవర్తనలో మార్పును ప్రియ గమనించింది. తన భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది. ఈ క్రమంలోనే అతడిపై కోపం పెంచుకుంది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. నువ్వు చేస్తుంది కరెక్టు కాదని.. ఆమెతో సంబంధాన్ని తెంచుకోవాలని ఎన్నోసార్లు చెప్పింది. కానీ తంగరాజ్ మారలేదు. దాంతో భర్తపై కోపం పెంచుకుంది ప్రియ.
వాగ్వాదం అనంతరం ఇద్దరూ నిద్రపోయారు..
సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కాసేపు వాగ్వాదం అనంతరం ఇద్దరూ నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత నిద్రలేచిన ప్రియ.. స్టవ్పై ఓ గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసింది. బాగా మరిగిన తర్వాత.. ఆ వేడి నీటిని తీసుకొని భర్త మర్మాంగాలపై పోసింది. మరుగుతున్న నీరు పడడంతో శరీర భాగాలు కాలిపోయాయి. నొప్పితో తంగరాజ్ విలవిల్లాడాడు. అతడి అరుపులను విని చుట్టుపక్కల వారు నిద్రలేచారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మొదట స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించాారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ 50శాతం కాలిపోయాయని.. మెరుగైన వైద్య చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలోనే వేలూరులో ఉన్న మరో పెద్దాస్పత్రికి ఆయన్ను షిప్ట్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Related News
666 Crores Jewels : రూ.666 కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఏమైందంటే ?
666 Crores Jewels : రూ.666 కోట్లు విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడింది.