Delimitation Issue : దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
Delimitation Issue : దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి అధికంగా ఆదాయం అందించేందుకు కారణమైనప్పటికీ, తిరిగి రావాల్సిన నిధులు తక్కువగా ఉండటం అన్యాయంగా మారింది
- By Sudheer Published Date - 12:28 PM, Mon - 17 March 25

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Issue) అంశం ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో (Southern States) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి గట్టి ప్రభావం ఉంటుందని అర్థమవుతోంది. ఉత్తరాదిలో జనాభా పెరుగుదల అధికంగా ఉండటంతో అక్కడి రాష్ట్రాలకు మరిన్ని సీట్లు లభించే అవకాశం ఉంది. అయితే జనాభా నియంత్రణను కచ్చితంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది క్రమంగా దక్షిణాది ప్రజలకు ప్రాతినిధ్యం తగ్గించి, దేశ పరిపాలనలో వారి పాత్రను తగ్గించే ప్రమాదాన్ని తెస్తుంది.
Gold Loan Renewal : గోల్డ్ లోన్ రెన్యూవల్.. కొత్త అప్డేట్ తెలుసుకోండి
దక్షిణాది రాష్ట్రాలు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా నిలిచాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక స్థితిని కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు, మంచి అవగాహన, విద్యాస్థాయి కారణంగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణపై తక్కువ శ్రద్ధ వల్ల అక్కడ జనాభా భారీగా పెరిగింది. దీని ఫలితంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిపితే దక్షిణాదికి నష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించాలి కానీ శిక్షించరాదు.
Court Collections : బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు
కేవలం ప్రజాసంఖ్య ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల పునర్విభజనను నిర్ణయించడం సరైంది కాదు. ప్రతీ ప్రాంత అభివృద్ధి స్థాయిని, ఆర్థిక ప్రగతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదనంగా నిధుల పంపిణీలో కూడా పారదర్శకత ఉండాలి. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి అధికంగా ఆదాయం అందించేందుకు కారణమైనప్పటికీ, తిరిగి రావాల్సిన నిధులు తక్కువగా ఉండటం అన్యాయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను సున్నితంగా పరిశీలించి, దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి.