HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >South
  • >Sack Minister For Sedition Congress Sleepover In Karnataka Assembly

Karnataka: కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వివాదం.. రాత్రి వేళ అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసనలు

కర్ణాటకలో వివాదాల సమయం నడుస్తోంది. హిజాబ్ వివాదమే ఇంకా చల్లారలేదనుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మరొక అంశం టెన్షన్ పెడుతోంది. రాష్ట్ర మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప..

  • By Hashtag U Published Date - 08:40 AM, Fri - 18 February 22
  • daily-hunt
Karnataka Assembly Imresizer
Karnataka Assembly Imresizer

కర్ణాటకలో వివాదాల సమయం నడుస్తోంది. హిజాబ్ వివాదమే ఇంకా చల్లారలేదనుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మరొక అంశం టెన్షన్ పెడుతోంది. రాష్ట్ర మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప.. జాతీయ జెండాను కాషాయరంగుతో మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. ఆయనను బర్తరఫ్ చేయాలని.. దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. అప్పటివరకు అసెంబ్లీలోనే ఉంటామని.. నిరసన తెలుపుతామని చెప్పింది.

రెండు రోజులుగా కర్ణాటక అసెంబ్లీ నిరసనలతో హోరెత్తింది. రెండో రోజు వాయిదాల పర్వం నడిచిన తరువాత కాంగ్రెస్ శాసనసభ్యులు సభలోనే ఉండిపోయారు. దీంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పలు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నేత, లెజిస్లేచర్ నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్యతో చర్చలు జరిపినా ఫలితం లేదు.

రెండు గంటలపాటు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపామని, అసెంబ్లీలో నిద్రించవద్దని కోరామని అయినా వాళ్లు వినలేదన్నది ప్రభుత్వం మాట. ఆఖరికి స్పీకర్ చెప్పినా వినలేదని యడియూరప్ప అన్నారు.
కానీ కాంగ్రెస్ మాత్రం పట్టువీడలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు కర్ణాటక కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలోనే ఉండిపోయారు. రాత్రి భోజనం కూడా అసెంబ్లీ క్యాంటీన్ లోనే చేశారు.

కాంగ్రెస్ మాత్రం ఈశ్వరప్ప వ్యాఖ్యలపై భగ్గుమంటోంది. అసలు ఈశ్వరప్ప ఏం అన్నారంటే.. భగవాధ్వజ్.. అంటే కాషాయ జెండా భవిష్యత్తులో ఎప్పుడైనా జాతీయ జెండాగా మారవచ్చని.. ఎర్రకోట నుంచి దానిని ఎగరవేయవచ్చని వ్యాఖ్యలు చేశారు. కాని ఇప్పుడు త్రివర్ణపతాకమే జాతీయ జెండా అని దానిని అందరూ గౌరవించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. ఈ వివాదంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది.

ಸರ್ಕಾರದ ತಪ್ಪುಗಳ ವಿರುದ್ಧ ಧ್ವನಿ ಎತ್ತುವುದು ವಿರೋಧಪಕ್ಷದ ಕರ್ತವ್ಯ. ಹಾಗಾಗಿ ರಾಷ್ಟ್ರಧ್ವಜಕ್ಕೆ ಅಪಮಾನಿಸಿರುವ ಸಚಿವರ ರಾಜೀನಾಮೆಗೆ ಆಗ್ರಹಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಸೂಕ್ತ ಕ್ರಮ ಜರುಗುವವರೆಗೂ ಹೋರಾಟ ಕೈಬಿಡುವುದಿಲ್ಲ. ದೇಶ ಒಡೆಯುವ ಹೇಳಿಕೆ ಸಮರ್ಥಿಸಿಕೊಳ್ಳುತ್ತಿರುವ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಇಂದು ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಅಹೋರಾತ್ರಿ ಧರಣಿ ನಡೆಯಲಿದೆ. pic.twitter.com/r6B8L9mQT6

— DK Shivakumar (@DKShivakumar) February 17, 2022

ఈశ్వరప్ప మాటలపై బీజేపీ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధం కాదని చెప్పింది. అసెంబ్లీలో గతంలో ప్రజాసమస్యలపై మాత్రమే రాత్రిపూట నిరసనలు జరిగాయని.. ఇప్పుడు మాత్రం రాజకీయ మైలేజ్ కోసం కాంగ్రెస్ ఇలా చేస్తోందని విమర్శించింది. చివరకు ఈ వివాదాన్ని ముగించడానికి స్పీకర్.. ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని నిర్వహించినా ఫలితం కనిపించలేదు. ఈశ్వరప్పపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న కాంగ్రెస్ వాయిదా తీర్మాన్ని స్పీకర్ ఆమోదించలేదు.

కర్ణాటక అసెంబ్లీలో చివరిసారిగా 2019లో ఇలా రాత్రిపూట నిరసనలు జరిగాయి. అప్పటి జనతాదళ్-కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి యడియూరప్ప బీజేపీ శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీలో రాత్రిపూట నిరసన తెలిపారు.

Solidarity to our @INCKarnataka MLAs who are protesting overnight at the Karnataka Assembly over the anti-national and atrocious remark by BJP Minister KS Eshwarappa on our National flag.

Never ever will the Saffron flag replace our Tiranga.@siddaramaiah @DKShivakumar pic.twitter.com/ZijCHUQgl4

— K C Venugopal (@kcvenugopalmp) February 17, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress protest
  • Congress Sleepover
  • karnataka
  • Karnataka Assembly
  • KS Eshwarappa comments

Related News

Ram Charan Met CM

Ram Charan Met CM: సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌లిసిన రామ్ చ‌ర‌ణ్‌.. వీడియో వైర‌ల్‌!

ఈ సమావేశం ప్రధానంగా మర్యాదపూర్వక భేటీగానే జరిగిందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య సినిమా పరిశ్రమ, అభివృద్ధి, కర్ణాటక-తెలంగాణ సంబంధాలు వంటి పలు విషయాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.

    Latest News

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd