Rain Alert : ఆ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు…!
తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
- By Hashtag U Published Date - 11:37 AM, Tue - 23 November 21
తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 26 న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ మరియు 24 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : ఏపీకి పొంచిఉన్న మరో గండం.. ఎప్పుడంటే..!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు జనజీవనం స్తభించింది. తమిళనాడులోని ఈరోడ్, సేలం, నమక్కల్, కళ్లకురిచ్చి, పెరంబలూరు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అదనంగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Shocking Videos Of Floods : కనీవినీ ఎరుగని విధ్వంసం
ఈ రోజు ( మంగళవారం) తమిళనాడులోని తిరునెల్వేలి, తూత్తుకుడి, మధురై, రామనాథపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్లోని మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖత తెలిపింది. తమిళనాడులోని కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడులోని అంతర్గత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Related News
Cyclone Michaung: భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు