Karnataka Ministers Portfolios Change : మంత్రివర్గం మార్పుల దిశగా కర్ణాటక సీఎం
కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
- Author : CS Rao
Date : 18-04-2022 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల టీంను మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ వ్యవహారంలో ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. దీనితో పాటు మరికొన్ని శాఖల్లోని మంత్రుల తీరుపై బీజేపీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఎన్నికల ముందుగా మంత్రివర్గంలోని మంత్రులను మార్చే సరికొత్త ఫార్ములా దిశగా వెళ్లిన బీజేపీ చాలా రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే ఫార్ములాను రచిస్తోంది. మంత్రివర్గం మార్పుపై “ఢిల్లీలో సమావేశం జరుగుతుందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై పార్టీ హైకమాండ్ పిలుపునిస్తుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం బొమ్మై ఆ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రానికి, నడ్డా ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశం నిర్వహించి సంస్థాగత అంశాలపై చర్చించారు.
బొమ్మై తన రెండు రోజుల దేశ రాజధాని పర్యటన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా పార్టీ ఉన్నతాధికారులను కలిశారు. ఎనిమిది నెలల ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా పేర్కొనబడింది. న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత, ముఖ్యమంత్రి తన పర్యటన “విజయవంతం” అని పేర్కొన్నారు. రాజకీయంగా ప్రభావవంతమైన లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బొమ్మై ఆయన కంటే ముందున్న బిఎస్ యడియూరప్ప పదవి నుండి వైదొలగడంతో గత ఏడాది జూలై 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే.