Karnataka 2023 : కర్ణాటక ఎన్నికల్లో `ఖర్గే` హత్య వ్యాఖ్యల రచ్చ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చిన `సుఫారీ`((karnataka 2023) వ్యవహారం కర్ణాటక ఎన్నికల్లోనూ తెర మీదకు వచ్చింది.
- By CS Rao Published Date - 04:23 PM, Sat - 6 May 23
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చిన `సుఫారీ`((karnataka 2023) వ్యవహారం కర్ణాటక ఎన్నికల్లోనూ తెర మీదకు వచ్చింది. అయితే, ఈసారి మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) కుటుంబీకుల్నీ హత్య చేసేందుకు కుట్ర అంటూ ఒక వీడియో కర్ణాటక ఎన్నికల తెర మీద హల్ చల్ చేస్తోంది. అప్పట్లో గుజరాత్ ఎన్నికల సందర్భంగా పాకిస్తాన్ తో సుఫారీ కుదుర్చుకుని హతమార్చడానికి ప్లాన్ చేసిందని కాంగ్రెస్ మీద మోడీ చేసిన ఆరోపణ. ఆ ఆరోపణ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వ్యవహారం ఖర్గే విషయంలో రావడం గమనార్హం.
కర్ణాటక ఎన్నికల్లోనూ తెర మీదకు`సుఫారీ`(Karnataka 2023)
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆయన భార్య, కుటుంబ సభ్యులందరినీ లేకుండా చేస్తానని బీజేపీ అభ్యర్థి పన్నాగం పన్నారని కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా శనివారం సంచలన ఆరోపణలు చేశారు.ఈనెల 10వ తేదీన పోలింగ్ జరగనున్న సమయంలో ఒక ఆడియో రికార్డింగ్ను సింగ్ ప్లే చేశాడు. ఆ వీడియోలో ఖర్గే, అతని భార్య ను తుడిచిపెడతానంటూ(Karnataka 2023) కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి మణికంఠ రాథోడ్ “కన్నడలో వ్యాఖ్యానించినట్టు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
బిజెపి అభ్యర్థి మణికంఠ రాథోడ్ ఆరోపణ
“కాంగ్రెస్ పార్టీకి కన్నడిగుల మద్ధతును గమనించి ముందుగానే బిజెపి మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను హత్య(Karnataka 2023) చేసేందుకు కుట్ర పన్నుతున్నారు” అని సుర్జేవాలా ఆరోపించారు. ఇలా వ్యాఖ్యానించడాన్ని నీచ రాజకీయం కింద సింగ్ భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నీలి కళ్ళ బాలుడు అంటూ రాథోడ్ ను విమర్శించారు. “ప్రధానమంత్రి మౌనంగా ఉంటారని నాకు తెలుసు, కర్ణాటక పోలీసులు మరియు భారత ఎన్నికల సంఘం కూడా అలాగే ఉంటారు. కానీ కర్ణాటక ప్రజలు మౌనంగా ఉండరని తగిన సమాధానం ఇస్తారు” అని సుర్జేవాలా అన్నారు.
Also Read : Karnataka Polls: కర్ణాటకలో కాంగ్రెస్ కు 140 సీట్లు ఖాయమంటున్న డీకే శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపణలపై(Karnataka 2023)విచారణకు హామీ ఇచ్చారు. “మేము ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటాము. మొత్తం విషయాన్ని విచారిస్తాము మరియు చట్టం దాని చర్య తీసుకుంటుంది` అని అన్నారు. ఆ వీడియోలోని వ్యాఖ్యలను రాథోడ్ ఖండించారు. ఆ ఆడియో నకిలీదని, తనను కించపరిచేందుకు కాంగ్రెస్ కల్పితమని అన్నారు. ఖర్గేకు గానీ, ఆయన కుటుంబానికి గానీ హాని తలపెట్టే ఉద్దేశం తనకు లేదని, ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
Also Read : Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో 6 రాష్ట్రాల ఓటర్లు..!
కొందరు ఫేక్ ఆడియో ప్లే (Karnataka 2023) చేస్తున్నారు.. ఓటమి భయంతో కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని రాథోడ్ అన్నారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చిత్తాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రియాంక్ ఖర్గేని హత్య చేస్తామని బెదిరించినందుకు 2022 నవంబర్ 13న బీజేపీ నాయకుడిని అరెస్టు చేసి, బెయిల్పై విడుదల చేసిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు ప్రియాంక్ ఖర్గేను కాల్చిచంపేందుకు తాను సిద్ధమేనని అప్పట్లో విలేకరుల సమావేశంలో అన్నారని ట్రోల్స్ చేస్తున్నారు.
Related News
INDIA Alliance: జూన్ 4న బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు
త్వరలో భారత కూటమి అధికారంలోకి వస్తుందని, బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని కూటమి భావిస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి లక్నోలో సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు