Jayalalitha Jewellery : 100 కోట్ల జరిమానా రికవరీ.. 28 కిలోల జయలలిత నగల వేలం
Jayalalitha Jewellery : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది.
- By Pasha Published Date - 02:36 PM, Mon - 26 February 24
Jayalalitha Jewellery : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. జయలలిత సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్లు చొప్పున జరిమానా వేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరుగుతుండగానే 2016 డిసెంబరు 5న జయలలిత తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో జయలలితపై కోర్టు విధించిన రూ.100 కోట్ల జరిమానాను రికవర్ చేసేందుకు.. ఆమెకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. ఆమె చనిపోయాక జరిమానా కట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆస్తులు అమ్మి జరిమానా మొత్తాన్ని రికవర్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అప్పట్లో జయలలిత ఇంట్లో అవినీతి నిరోధకశాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు, 800 కిలోల వెండి నగలు, ఇతర వజ్రాభరణాలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. అందుకోసం నగలను మార్చి 6, 7న తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే రూ.40 కోట్ల వరకు ధర పలకనున్నాయి. మిగిలిన రూ.60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టారు.జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను(Jayalalitha Jewellery) తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించింది. మార్చి 6,7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read : Adani EV : ఉబెర్ – అదానీ గ్రూప్ ఈవీ వ్యాపారం.. ఏం చేస్తారంటే ?
ఇవీ వస్తువులు
- అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి.
- ఈ వస్తువుల జాబితాలో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు; 700 కిలోల వెండి వస్తువులు; 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి.
- 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read :Drug Party : రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్
Related News
Jayalalitha Jewellery : 6 పెట్టెల్లో జయలలిత ఆభరణాలు.. అవన్నీ ఎవరికో తెలుసా ?
Jayalalitha Jewellery : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు, వజ్రాభరణాల పెట్టెలు ఎవరివి ?