HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Congress Majority In Karnataka Opinion Polls Said

Karnataka Congress: కర్ణాటకలో ‘హస్తం’ గాలి.. కాంగ్రెస్‌‌కు కన్నడిగులు జై!

ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియర్ పోల్‌‌లో కాంగ్రెస్‌వైపే కన్నడిగులు మొగ్గుచూపుతోన్నట్టు తేలింది.

  • Author : Balu J Date : 30-03-2023 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karntaka Congress1
Karntaka Congress1

ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ కర్ణాటక వైపు చూస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన కాంగ్రెస్ కర్ణాటకలో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సంచలన విషయాలను బహిర్గతం చేశాయి. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? అనే ఉత్కంఠ తకు చెక్ పెట్టింది ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియర్ పోల్‌‌. ఈ సర్వేలో కాంగ్రెస్‌వైపే కన్నడిగులు మొగ్గుచూపుతోన్నట్టు తేలింది. కర్ణాటకలో ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించిన ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే తాజాగా ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే అంచనాల ప్రకారం హస్తం పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టనున్నట్టు వెల్లడయ్యింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ 115-127 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

అధికార బీజేపీ 68-80 స్థానాలు, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ 23-35 సీట్లను గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. ప్రాంతాల వారీగా చూస్తే 31 స్థానాలు ఉన్న హైదరాబాద్‌-కర్ణాటకలో కాంగ్రెస్‌ 19-23, బీజేపీ 8-12 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 50 స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు తప్పదని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ 25-29 స్థానాల్లోనూ, బీజేపీ 21-25 సీట్లను కైవసం చేసుకునే పరిస్థి ఉందని వివరించింది.

ఇక, 21 స్థానాలున్న కోస్తాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉందని, ఇక్కడ బీజేపీ 9-13 స్థానాల్లోను, కాంగ్రెస్‌ 8-12 స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంది. బీజేపీకి కంచుకోట సెంట్రల్‌ కర్ణాటకలోనూ కాంగ్రెస్‌-బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదని సర్వే పేర్కొంది. ఈ ప్రాంతంలోని 35 స్థానాల్లో బీజేపీ 12-16 స్థానాలు, కాంగ్రెస్‌ 18-22 స్థానాల్లోనూ, జేడీఎస్‌ 2 స్థానాల వరకూ విజయం సాధించే అవకాశం ఉంది.
పాత మైసూర్‌ ప్రాంతంలో మాత్రం జేడీఎస్ తన పట్టు నిలుపుకోనుందని వెల్లడయ్యింది. అక్కడ ప్రజలు జేడీఎస్‌తో పాటు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వే స్పష్టం చేసింది. మొత్తం 55 స్థానాలున్న పాత మైసూరులో జేడీఎస్‌ 26-27 స్థానాల్లోను, కాంగ్రెస్‌ 24-28 స్థానాల్లోను, బీజేపీ కేవలం 1-5 స్థానాల్లోనూ గెలిచే అవకాశం కనిపిస్తోంది.

బెంగళూరు నగరంలో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్‌కు 15-19, బీజేపీకి 11-15 సీట్లు స్థానాలు దక్కే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రభావం చూపుతుందని ఏబీపీ-సీ ఓటరు సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 24.6 శాతం మంది ఇదే అభిప్రాయం వెల్లడించారు. కాగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం సిద్దరామయ్య వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఆయనకు 39 శాతం మంది జైకొట్టగా.. ప్రస్తుతం సీఎం బసవరాజ్ బొమ్మైను 31.1 శాతం, జేడీఎస్ అధినేత కుమారస్వామిని 21.1 శాతం మంది కోరుకుంటున్నారు.
అటు, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై 50 శాతం మందికిపైగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాలన బాగుందని కేవలం 27.7 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. సీఎం బసవరాజ బొమ్మై పనితీరును 47 శాతం మంది మంది వ్యతిరేకిస్తున్నారు. కేవలం 27 శాతం మంది మాత్రమే బాగుందని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి 57 శాతం మంది.. పాలన మారాలని కోరుకుంటున్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Karnataka Assembly
  • Karnataka elections 2023
  • majority
  • Opinion polls

Related News

Congress ranks call for movement in wake of National Herald case

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా వేధింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • Telangana Speaker G Prasad Kumar

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd