Child Elephant : నాటు బాంబుని తిని మరణించిన పిల్ల ఏనుగు..
అడవి పందుల కోసం వేటగాళ్ళు ఏర్పాటు చేసిన నాటు బాంబుని ఆరేళ్ళ ఆడ ఏనుగు పండుగా భావించి కొరకడంతో నోటిలోనే ఆ బాంబు పేలింది.
- By News Desk Published Date - 09:27 PM, Wed - 6 September 23
కోయంబత్తూరు – ఊటి(Ooty) సమీపంలోని అటవీ ప్రాంతంలో పలు జంతువులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ అడవి పందులను(Forest Pigs) పట్టుకోవడానికి వేటగాళ్లు నాటు బాంబులు పెడతారు. అయితే అనుకోకుండా ఓ పిల్ల ఏనుగు(Child Elephant) ఆ నాటు బాంబుని పండు అనికొని తినగా అది పేలి ఏనుగు మరణించింది.
అడవి పందుల కోసం వేటగాళ్ళు ఏర్పాటు చేసిన నాటు బాంబుని ఆరేళ్ళ ఆడ ఏనుగు పండుగా భావించి కొరకడంతో నోటిలోనే ఆ బాంబు పేలింది. నోటి వద్ద తీవ్రమైన రక్తం స్రావంతో రోడ్డు మీద సహాయం కోసం పెద్ద ఎత్తున అరుస్తూ ఆర్తనాదాలు చేసింది. అటవీ అధికారులు విషయం తెలుసుకొని వచ్చి చికిత్స చేద్దామనుకున్నా ఏనుగు నొప్పితో సహకరించలేక ఆర్తనాదాలతో మరణించింది.
దీంతో ఈ సంఘటన అక్కడి ప్రజలని కంటతడి పెట్టిస్తుంది. ఏనుగు అంత్యక్రియలకు అటవీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : TTD Alipiri Sticks : ఇవాళ్టి నుంచే భక్తులకు కర్రలు.. చిరుతలతో పోరాడామని కాదు.. టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే..
Related News
Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ
Elephants Attack : ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల ప్రజలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.