DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోంది: డీకే శివకుమార్
- By Balu J Published Date - 12:28 AM, Sat - 20 April 24
![DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోంది: డీకే శివకుమార్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/06/dk-shivakumar.jpg)
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. హుబ్బళ్లిలోని తన కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ కౌన్సిలర్ కుమార్తె హత్య తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష బీజేపీ చేసిన ఆరోపణపై ఆయన స్పందించారు. బీజేపీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని… తాము గవర్నర్ పాలన విధించబోతున్నామని ఓటర్లకు చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని గవర్నర్ పాలనలో పెట్టాలని చూస్తున్నారని, అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కానీ వారు అలా చేయలేరు. అది అసాధ్యం…” శివకుమార్ తెలిపారు.
హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తె నేహా హిరేమఠ్ (23) గురువారం బీవీబీ కళాశాల ఆవరణలో దారుణ హత్యకు గురైంది. ఘటనా స్థలం నుంచి పరారైన నిందితుడు ఫయాజ్ ఖోండునాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. నేహా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) మొదటి సంవత్సరం విద్యార్థిని కాగా, ఫయాజ్ గతంలో ఆమె క్లాస్ మేట్. ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య రాజకీయ దుమారానికి దారితీసింది. అధికార పార్టీ దీన్ని వ్యక్తిగత కోణంలో జరిగిన సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, కాషాయ పార్టీ దీనిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించిందన్నారు డీకే.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Harish Rao: ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, రైతుల సంక్షేమం పట్ల లేదు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/harish-rao-1.jpg)
Harish Rao: ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, రైతుల సంక్షేమం పట్ల లేదు
Harish Rao: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్