DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోంది: డీకే శివకుమార్
- By Balu J Published Date - 12:28 AM, Sat - 20 April 24
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. హుబ్బళ్లిలోని తన కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ కౌన్సిలర్ కుమార్తె హత్య తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష బీజేపీ చేసిన ఆరోపణపై ఆయన స్పందించారు. బీజేపీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని… తాము గవర్నర్ పాలన విధించబోతున్నామని ఓటర్లకు చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని గవర్నర్ పాలనలో పెట్టాలని చూస్తున్నారని, అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కానీ వారు అలా చేయలేరు. అది అసాధ్యం…” శివకుమార్ తెలిపారు.
హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తె నేహా హిరేమఠ్ (23) గురువారం బీవీబీ కళాశాల ఆవరణలో దారుణ హత్యకు గురైంది. ఘటనా స్థలం నుంచి పరారైన నిందితుడు ఫయాజ్ ఖోండునాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. నేహా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) మొదటి సంవత్సరం విద్యార్థిని కాగా, ఫయాజ్ గతంలో ఆమె క్లాస్ మేట్. ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య రాజకీయ దుమారానికి దారితీసింది. అధికార పార్టీ దీన్ని వ్యక్తిగత కోణంలో జరిగిన సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, కాషాయ పార్టీ దీనిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించిందన్నారు డీకే.
Related News
Vaddiraju: కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద�