Deve Gowda : సీఎం పదవి ముద్దు..ప్రధాని కుర్చీ వద్దన్న గౌడ
సంకీర్ణ ప్రభుత్వానికి నడిపేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు ధైర్యంచేసి ముందుకు వచ్చే వాళ్లు చాలా అరుదు.
- By CS Rao Published Date - 05:21 PM, Fri - 12 November 21
సంకీర్ణ ప్రభుత్వానికి నడిపేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు ధైర్యంచేసి ముందుకు వచ్చే వాళ్లు చాలా అరుదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి పదవిని వదులుకుని ప్రధానిగా ఉండేందుకు ఇష్టపడరు. దానికి కారణంగా ఎక్కవ కాలం ప్రభుత్వాన్ని నడపలేమనే అనుమానం. అందుకే, చంద్రబాబు, జ్యోతిబసు తదితరులకు ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ దూరంగా ఉన్నారని సీనియర్ రాజకీయవేత్తలు చెబుతుంటారు. కర్నాటక రాష్ట్రానికి సుదీర్ఘ కాలం సీఎంగా ఉండాలని కోరిక ఉన్నప్పటకీ అయిష్టంగా ప్రధాని పదవిని దేవెగౌడ చేపట్టాల్సి వచ్చింది. ఆ విషయాన్ని త్వరలో విడుదల కానున్న గౌడ జీవిత చరిత్ర పుస్తకంలో పొందుపరిచారు.
1996లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి దేవెగౌడ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రధాని పదవి దిశగా అనుకూలంగా ఆయన మనసు లేదు. కర్నాటక రాజకీయాల్లో కొనసాగి తన కెరీర్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించాడు. అందుకే, తొలుత సున్నితంగా తిరస్కరించాడు.ఆ విషయాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన పుస్తకంలో రచయిత సీనియర్ జర్నలిస్ట్ సుగత శ్రీనివాసరాజు పొందుపరిచాడు. `ఫర్రోస్ ఇన్ ఎ ఫీల్డ్: ది అన్ఎక్స్ప్లోర్డ్ లైఫ్ ఆఫ్ హెచ్డి దేవెగౌడ` పుస్తకంలో కొన్ని విచిత్రమైన సంఘటనలను వివరించాడు. ప్రధాని పదవికి అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసును గౌడ అభ్యర్థించినట్లు ఉటంకించారు: “సార్, నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండేళ్లు కూడా కాలేదు. నా కెరీర్ అకస్మాత్తుగా ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపనివ్వదు. నేను మీలాగే దీర్ఘకాలం పాటు కర్ణాటకను చాలా సంవత్సరాలు పాలించాలనుకుంటున్నాను` అని చెప్పాడట.
11 నెలల తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది, ప్రధానమంత్రిగా గౌడ పరుగును తగ్గించింది. ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి ముందు గౌడ ఆలోచనలను ఈ పుస్తకం సంగ్రహించింది. చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్లను కాంగ్రెస్ ఏం చేసిందో మనందరికీ తెలియదా? వారు నన్ను విడిచిపెడతారా? దయచేసి మీ మనసు మార్చుకోండి. నాకు హిందీలో కూడా రాదు. ఈ దేశం అంతటా ప్రయాణించలేదు. నువ్వే మా పెద్దవి, నిన్ను వేడుకుంటున్నాను’’ అని గౌడ బసును బతిమాలాడట.”అతను వినడానికి ఇష్టపడలేదని, నేను అతని పాదాలను తాకి, నా వాదనను అంగీకరించమని అభ్యర్థించాను” అని గౌడ పుస్తకంలో ఉటంకించారు. ఎంతగా అంటే, బసు అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నిలబెట్టగలడని గౌడ నమ్మకం. కానీ ఆ సమయంలో బసు ఇలా అన్నాడట..“మిస్టర్ గౌడ, వాజ్పేయికి మించిన లౌకిక ప్రత్యామ్నాయం మనకు లేదు. నేను బయటకు వెళ్లి భారతదేశ ప్రజలకు చెప్పనా? సెక్యులర్ ప్రధాని కోసం మనం వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వగలమా? అంటూ నిట్టూర్చాడని గౌడ్ పుస్తకంలో తెలిపాడు.
యునైటెడ్ ఫ్రంట్ నేతలు ఆయన పేరును ఆ పదవికి ప్రతిపాదించడంతో గౌడ తొలుత షాక్ అయ్యాడు. తన రాజకీయ చతురత సంకీర్ణ ప్రభుత్వానికి సరిపోదని చెప్పాడట. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం మద్దతును కొనసాగించడంపై గౌడ సందేహం వ్యక్తం చేశాడని పుస్తకంలో పొందుపరిచారు. అతని ఊహ సరైనదని ఆ తరువాత జరిగిన పరిణామాలు నిరూపించాయి.గౌడ 1994లో ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోవడం సుదీర్ఘ రాజకీయ పోరాటం. 1996లో ప్రధానమంత్రి పదవిని అవకాశం రావడంతో రాజకీయ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ రాష్ట్రంలోని 28 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలను గెలుచుకుని, జాతీయ స్థాయికి ఎదిగి, బలీయమైన స్థితిలో ఉంది. ఆ సమయంలోనే అనివార్యంగా గౌడ ప్రధాన మంత్రి పదవిని చేపట్టాల్సి వచ్చింది.గౌడను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం..బసు మరియు అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జనరల్ సెక్రటరీ హరికిషన్ సింగ్ సూర్జిత్ల నిర్ణయమని పుస్తకంలో పొందుపరిచాడు. దశాబ్దాలుగా దేశంలో రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రచయిత శ్రీనివాసరాజు రచించిన గౌడ జీవిత చరిత్రలో అనే అంశాలను చొప్పించాడు. కీలక ఘట్టాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. వాటిలోని ప్రధానమైనది ఇష్టంలేకుండా ప్రధాని పదవిని గౌడ చేపట్టడం ఒకటి.
Related News
Family Politics : ఎన్నికల సమరంలో మాజీ ప్రధాని దూకుడు.. ముగ్గురు బరిలోకి !
Family Politics : ఎలక్షన్లలో ఏదైనా ఫ్యామిలీ నుంచి అతి కష్టం మీద ఒకరిద్దరు పోటీ చేస్తుంటారు.