Karnataka: ఓ ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడంతో… ప్రొఫెసర్ సస్పెండ్..!!
- By hashtagu Published Date - 08:20 PM, Mon - 28 November 22
కర్నాటకలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడం కలకలం రేపింది. ప్రొఫెసర్ ఓ విద్యార్థిని నువ్ టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ ప్రొఫెసర్ ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ ప్రశ్నతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ప్రొఫెసర్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. విద్యార్థులందరి ముందు తనను తీవ్రవాది అని ఎలా అంటారంటూ నిలదీశాడు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది.
#Manipal University professor called a Muslim student a ‘terrorist’ .. when student protested, the professor not even bothered…
This is how a normal day look like in Manuwadi aatankwadi balatkari sada hua samaj. #manipaluniversity pic.twitter.com/5HaPXdVdob
— Salute to Karnataka Sisters (@SMAWoke) November 28, 2022
అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ వీడియో బయటకు లీక్ కావడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసింది. విచారణ కమిటీ ఏర్పాటు చేసి…ఆ విద్యార్థిని ఎందుకు ఉగ్రవాదిగా పిలిచాడో…అనే విషయంపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ స్పందించారు. తమ యూనివర్సిటీలో సర్వ ధర్మాన్ని నమ్ముతామని తెలిపారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సదరు విద్యార్థికి కూడా కౌన్సింగ్ ఇస్తామని తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి స్పందించాడు. నేను నా స్నేహితులతో కలిసి చూస్తుండగా…ప్రొఫెసర్ నన్ను ఉగ్రవాది కసబ్ తో పోల్చాడని తెలిపాడు.
Tags
Related News
YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.