Tamil Nadu Assembly : బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు
Tamil Nadu Assembly : అప్పు పేరుతో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు అవసరమన్న భావనతో ఈ చట్టం రూపొందించారు
- Author : Sudheer
Date : 14-06-2025 - 8:23 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు (Tamilanadu) రాష్ట్రంలో అప్పు వసూలు (Debt collection) పేరుతో బలవంతపు చర్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి (Governor R.N. Ravi) ఆమోదం తెలిపారు. అప్పు ఇచ్చిన వారు రుణగ్రహితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, శారీరకంగా బెదిరించడం వంటి చర్యలకు ఇకపై చట్టపరమైన గుణపాఠం చెప్పే విధంగా ఈ చట్టం రూపొందించబడింది.
ICRISAT : ఇక్రిశాట్ క్యాంపస్ కు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లినట్లు..?
ఈ బిల్లును తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Deputy CM Udhayanidhi Stalin) ఈ ఏడాది ఏప్రిల్ 26న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పు పేరుతో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు అవసరమన్న భావనతో ఈ చట్టం రూపొందించారు. అసెంబ్లీలో బిల్లు సమ్మతించబడిన తర్వాత గవర్నర్ ఆమోదంతో అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. ప్రజలను గౌరవంగా రుణ చెల్లింపులో ప్రోత్సహించడమే కాకుండా అక్రమ వసూళ్లను నియంత్రించడమే లక్ష్యంగా ఉంచారు.
Iran-Israel War : తగలబడిపోతున్న ఎయిర్పోర్ట్
ఈ చట్టం ప్రకారం..ఎవైనా రుణదాతలు బలవంతంగా రుణం వసూలు చేసినట్టయితే వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. అంతేకాక ఈ కేసులో బెయిల్ కూడా లభించదు. రుణగ్రహితుల హక్కులను కాపాడే దిశగా తమిళనాడు ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని సామాజిక సేవా సంఘాలు, హక్కుల కార్యకర్తలు ప్రశంసిస్తున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలకూ ఇది ఒక ఉదాహరణగా నిలవనుంది.