Leopard Scare: చిరుత సంచారం.. 22 పాఠశాలలకు సెలవులు!
కర్ణాటకలోని బెలగావి జిల్లా నివాస ప్రాంతంలో చిరుతపులి సంచరించడంతో కర్ణాటకలోని ఈ ప్రాంతంలోని 22 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సోమవారం అధికారులు సెలవు ప్రకటించారు.
- By Balu J Published Date - 08:55 PM, Mon - 22 August 22
కర్ణాటకలోని బెలగావి జిల్లా నివాస ప్రాంతంలో చిరుతపులి సంచరించడంతో కర్ణాటకలోని ఈ ప్రాంతంలోని 22 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సోమవారం అధికారులు సెలవు ప్రకటించారు. బెళగావి నగరం కంటోన్మెంట్ ఏరియా, పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిరుతపులి గోల్ఫ్ గ్రౌండ్స్ దగ్గర సంచరిస్తూ ఓ ప్రైవేట్ స్కూల్ క్యాంపస్ దగ్గర అదృశ్యమైంది.
చిరుతపులి కదలికను ప్రైవేట్ బస్సు డ్రైవర్ గమనించారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లలలో భయాందోళనలకు కారణమైంది. సంచరిస్తున్న చిరుతను బోనులో బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బెళగావి నగరంలోని జాదవ్నగర్లో భవన నిర్మాణ కార్మికుడిపై దాడి జరగడంతో అధికారులు 18 రోజులుగా చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడి తర్వాత కనిపించని చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. ఎలాంటి అవకాశం లేకుండా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బసవరాజ నలతవాడ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Related News
Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!
మీరు తిరుమలకు వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్త వహించాల్సిందే. మెట్ల మార్గంలో 3 చిరుతలు ఉన్నాయట.