Indore : దొంగతనం చేశారన్న నెపంతో ఇద్దరు మైనర్లను వాహనానికి కట్టేసి..ఈడ్చుకెళ్లి..!!
- By hashtagu Published Date - 07:14 AM, Sun - 30 October 22
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో ఇద్దరు మైనర్లను కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. వారిని లోడింగ్ వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లారు. వారిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…వారిని ఆసుపత్రికి తరలించారు. బడి చోయిత్రం కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్లను తాలిబానీ స్టైల్లో కొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ లోని చోయిత్రం కూరగాయల మార్కెట్లో ఇద్దరు మైనర్ బాలురులు కారులో నుంచి కొన్ని వస్తువులను బయటకు తీయడం కనిపించింది. వారిని గమనించిన కారు డ్రైవర్ …వారిద్దర్నీ పట్టుకుని అతికిరాతకంగా కొట్టారు. ఈ ఘటనను అక్కడున్న స్థానికులు రికార్డు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ల పై దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారని వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఏసీపీ నిహిత్ ఉపాధ్యాయ తెలిపారు.
MP: 2 boys beaten, dragged by vehicle for theft in Indore
A video of 2 minor boys getting beaten up went viral, incident occurred at 8am today. These boys were caught by workers nearby, stealing from a car. Medical exam underway; we'll take further action on basis of probe: ACP pic.twitter.com/32aQDaCt1C
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 29, 2022
Tags
Related News
Sreenivasa Prasad Dies: మాజీ కేంద్ర మంత్రి శ్రీనివాస ప్రసాద్ మృతి
కర్ణాటకలోని చామరాజనగర్కు ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 76 సంవత్సారాలు.