Viral Video : దటీజ్ దీదీ , నడిరోడ్డుపై కాన్వాయ్ ఆపి పకోడీలు వేసి షాకిచ్చిన సీఎం మమత..!!!
- By hashtagu Published Date - 06:36 PM, Tue - 15 November 22
ఎప్పుడూ గంభీరంగా కనిపించే పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ…అప్పుడప్పుడు సరదాగా కూడా ఉంటారు. ఇవాళ ఝరాగ్రామ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దీదీ వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న దీదీకి మార్గమధ్యలో ఓ టీస్టాల్ కనిపించింది. వెంటనే తన కాన్వాయ్ ఆపారు. టీస్టాల్ లోకి వెళ్లి పకోడి వేశారు. అక్కడున్న జనాలకు తానే స్వయంలో పేపర్ లో పకోరాలు వడ్డించారు. దీంతో దుకాణం వద్ద సందడి నెలకొంది. అంతకు ముందు కూడా బెంగాల్లోని జార్ గ్రామ్ జిల్లాలో సీఎం మమత డ్రమ్ వాయిస్తూ కనిపించారు. మమతాబెనర్జీ ఇలా చేయడం ఇదేమీ కొత్త కాదు. ఇలా చాలా సార్లు సామాన్యల మధ్య గడపడం గతంలో చాలా సార్లు కనిపించింది.
#WATCH | West Bengal CM Mamata Banerjee stopped her convoy at a roadside tea stall and started serving pakoda to the people, in Jhargram. pic.twitter.com/2b3NKhXj5q
— ANI (@ANI) November 15, 2022
ఇక ఝరాగ్రామ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా గిరిజనుల భూమిని ఎవరూ లాక్కేలేరని కేంద్రంపై పరోక్షంగా మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వం అభివ్రుద్ధికి నిధులు ఇవ్వవద్దని కొందరు ఢిల్లీకి లేఖలు రాశారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వ దౌర్జన్యాలను డోలు, బాణాలు, విల్లంబులతో ఎదురించాలని ప్రజలకు సూచించారు.
Related News
Teacher Recruitment Case:: సీఎం మమతకు బిగ్ షాక్.. వేల ఉద్యోగాలు రద్దు
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్పై సోమవారం తీర్పు వెలువరిస్తూ 2016 మొత్తం ప్యానెల్ను రద్దు చేయాలని ఆదేశించింది.