Apple : కుల వివక్షపై “యాపిల్” బ్యాన్.. భారత కుల వ్యవస్థ పై హెచ్ ఆర్ టీమ్ కు ట్రైనింగ్!!
ప్రపంచంలో పేరెన్నికగన్న ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల్లో ఎన్నడూ లేనిది ఇప్పుడు కులం, కుల వివక్ష పై హాట్ డిబేట్ జరుగుతోంది. ఈ డిబేట్ జరగడానికి ఇటీవల చోటుచేసుకున్న ఒక ముఖ్య ఘటనే కారణమని గట్టిగా చెప్పొచ్చు.
- By Hashtag U Published Date - 02:00 PM, Tue - 16 August 22
ప్రపంచంలో పేరెన్నికగన్న ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల్లో ఎన్నడూ లేనిది ఇప్పుడు కులం, కుల వివక్ష పై హాట్ డిబేట్ జరుగుతోంది. ఈ డిబేట్ జరగడానికి ఇటీవల చోటుచేసుకున్న ఒక ముఖ్య ఘటనే కారణమని గట్టిగా చెప్పొచ్చు. ఆ కారణం ఏమిటో తెలుసుకునే ముందు.. కుల వివక్ష ను నిషేధిస్తూ రెండేళ్ల క్రితమే టెక్ దిగ్గజం “యాపిల్” వర్క్ పాలసీలో చేసిన మార్పులపై ఓ లుక్ వేద్దాం. కుల వివక్ష కు తాము వ్యతిరేకం అని చాలా కంపెనీలు.. చాలా దశాబ్దాలుగా చాలా మాటలు చెబుతున్నాయి. కానీ ఈ విషయాన్ని నేరుగా కంపెనీ వర్క్ పాలసీలో చేర్చిన ఏకైక టెక్ కంపెనీ ప్రస్తుతానికి “యాపిల్” మాత్రమే. రెండేళ్ల క్రితమే (2020 సంవత్సరంలో) తమ గ్లోబల్ వర్క్ పాలసీలో కుల వివక్ష ను బ్యాన్ చేసే అంశాన్ని చేర్చింది. తమ హెచ్ ఆర్ టీమ్ కు భారత్ లోని కుల వ్యవస్థ గురించి ట్రైనింగ్ కూడా ఇస్తోంది.
యాపిల్ చారిత్రక నిర్ణయానికి కారణం ?
కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ నియంత్రణ సంస్థ 2020 సంవత్సరం లో ఒక బహుళజాతి కంపెనీపై న్యాయ వ్యాజ్యం వేసింది. ఆ కంపెనీలో పనిచేసిన ఒక నిమ్న కుల ఇంజినీర్.. ఇద్దరు అగ్ర కుల
ఇంజినీర్లు తన కెరీర్ ను నాశనం చేశారంటూ కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ నియంత్రణ సంస్థను ఆశ్రయించాడు. దీనిపై కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ నియంత్రణ సంస్థ స్పందించి..నిమ్న కులానికి చెందిన బాధితుడి తరఫున కోర్టుకు ఎక్కింది. ఈనేపథ్యంలో అప్పట్లోనే (2020 జూన్) యాపిల్ కంపెనీ తమ వర్క్ పాలసీలో కుల వివక్ష ను నిర్మూలించే నిబంధన చేర్చింది. దీంతోపాటు ఐబీఎం కంపెనీ కూడా ఈ దిశగా చర్యలు చేపట్టింది.
కులం అంశంపై కుదుపులు ..
ఏటా ఏప్రిల్ నెలను దళితుల చరిత్ర, చరిత్రలో దళితులతో ముడిపడిన ఘట్టాలను గుర్తు చేసుకునే నెలగా నిర్వహించుకుంటున్నారు. ఈక్రమంలోనే 2022 ఏప్రిల్ నెలలో దళితుల చరిత్ర అంశాలపై గూగుల్ న్యూస్ ఉద్యోగులకు ఒక గెస్ట్ లెక్చర్ ను ఏర్పాటు చేశారు. ఈ గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు “ఈక్వాలిటీ ల్యాబ్స్” ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేన్ మోజీ సౌందరరాజన్ ను గూగుల్ న్యూస్ సీనియర్ మేనేజర్ తనూజ గుప్తా ఆహ్వానించారు. ఇక్కడి వరకు ఏమీ జరగలేదు. ఆ తర్వాత .. తేన్ మోజీ సౌందరరాజన్ కు మాట్లాడే అవకాశం కల్పిస్తే హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందంటూ చాలామంది ఉద్యోగుల నుంచి గూగుల్ ఉన్నతాధికారులకు మెయిల్స్ వెల్లువెత్తాయి. దీంతో తేన్ మోజీ సౌందరరాజన్ గెస్ట్ లెక్చర్ ప్రోగ్రాం ను రద్దు చేశారు. ఈ పరిణామంతో
గూగుల్ న్యూస్ సీనియర్ మేనేజర్ తనూజ గుప్తా మనస్తాపానికి గురయ్యారు. గెస్ట్ లెక్చర్ కోసం తాను ఆహ్వానించిన తేన్ మోజీ సౌందరరాజన్ ప్రోగ్రాంను రద్దు చేసినందుకు నిరసనగా తనూజ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కుల సమానత్వం టాపిక్ పై మాట్లాడకుండా తన గెస్ట్ లెక్చర్ ను గూగుల్ రద్దు చేసిందంటూ తేన్ మోజీ సౌందరరాజన్ ఆరోపించారు. అయితే ఈ విమర్శలను గూగుల్ ఖండించింది. సమ సమానత్వానికి గూగుల్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
Related News
Apple : ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ వార్నింగ్..
Apple: యాపిల్ సంస్థ(Apple) తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు(users) ఆ హెచ్చరిక వెళ్లింది. మెర్సినరీ స్పైవేర్(Mercenary spyware)తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్నింగ్ నోటిఫికేషన్లో యాపిల్ సంస్థ వెల్లడించింది. మీరు మెర్సినరీ స్పైవేర్ బాధితులు అయి ఉంటారని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఐఫోన్లను హ్యాక్ చేసే