Multani Mitti: చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ముల్తానీ మట్టిని ఉపయోగించాల్సిందే?
ముల్తానీమట్టి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడు
- By Nakshatra Published Date - 06:30 PM, Mon - 5 February 24
ముల్తానీమట్టి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీనిని తరుచుగా ఉపయోగించడం వల్ల మీ అందాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో ముల్తానీ మట్టిని ఉపయోగించి ఉంటారు. కొందరు ముల్తానీ మట్టితో తయారైన బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తే మరికొందరు నేరుగా ముల్తానీ మట్టిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ముల్తానీ మట్టిని ఉపయోగించి చర్మ సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారా. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ చొప్పున పెరుగు, కీరదోస గుజ్జు, రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపి, తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి.
దాన్ని ముఖం, మెడకు రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది. అలాగే రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో మాస్క్లా రాయాలి. తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి. దీంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక కడిగేయాలి. దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.
రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్ స్పూన్ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి. దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం దృఢంగా ఉంటుంది. సాగిపోయినట్లు కనిపించదు. అలాగేచర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్లా వేయాలి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదుత్వం వస్తుంది.
Related News
Alcohol Side Effects: ఆల్కహాల్ అతిగా తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు వచ్చినట్లే..!
మద్యపానం ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో అందరికీ తెలిసిందే. మీరు మీ ఇంటి చుట్టుపక్కల లేదా ప్రతిరోజూ వార్తల ద్వారా దాని దుష్ప్రభావాలను (Alcohol Side Effects) చూస్తారు. ఆల్కహాల్ లో ఇథనాల్ ఆల్కహాల్లో ఉంటుంది.