Dry Skin: డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటే వెంటనే ఇలా చేయండి?
చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా పొడి చరణం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రోడక్టు
- By Nakshatra Published Date - 10:10 PM, Fri - 8 September 23
చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా పొడి చరణం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రోడక్టులు హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే వివిధ కారణాల వల్ల మనం చర్మం పొడిబారుతుంది అన్న విషయం తెలిసిందే. తగినన్ని నీరు తాగకపోవడం వల్ల కూడా చర్మం పొడిబారుతూ ఉంటుంది.. మరి పొడి చర్మం ఉన్నవారు ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పొడి చర్మం ఉన్నవారు ఖచ్చితంగా రోజుకు కనీసం రెండుసార్లైనా మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం వల్ల అది మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది.
ఇందుకోసం పొడిబారిన చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్ నే వాడాలి. పొడి చర్మం ఉన్నవారు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ముందుగా చెప్పుకున్నట్టుగా పొడి చర్మం ఉన్నవారు నీటిని పుష్కలంగా తాగాలి. శరీరానికి సరిపడా నీరు అందకపోవడం వల్లే చర్మం పొడిబారుతుంది. నీటిని పుష్కలంగా తాగడం వల్ల మీ చర్మం హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పొడి చర్మం ఉన్నవారు కొన్ని పండ్లను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా కీరదోసకాయలు, పుచ్చకాయలు, ద్రాక్షలు వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను తినాలి.
ఎందుకంటే ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తాయి. పొడిబారడాన్ని తగ్గిస్తాయి. పొడి చర్మం ఉన్నవారికి పొడి పెదవులు కూడా పొడిబారుతాయి. దీనివల్ల పెదాలు పగిలి అందులోంచి రక్తం వచ్చే అవకాశం కూడా ఉండి. అందుకే ఇలాంటి వారు పెదాలకు రెగ్యులర్ గా లిప్ బామ్ ను అప్లై చేయాలి. లేదా కొబ్బరినూనెను కూడా అప్లై చేయవచ్చు. ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ పంచదార, కొద్దిగా తేనె వేసి బాగా కలిపి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి తర్వాత కడిగేయాలి. అన్నింటికి మించి శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య నుంచి 75% బయటపడవచ్చు అంటున్నారు వైద్యులు.
Related News
Water: రాత్రిపూట నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పాడవుతాయా..?
జీవించడానికి నీరు అవసరం. అయితే రాత్రిపూట నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పాడవుతాయని తరచుగా వార్తలు వస్తున్నాయి.