Health Benefits: ఈ రెండు చిట్కాలు ఉపయోగిస్తే చాలు ఎలాంటి కాళ్ల పగుళ్లు అయినా మాయం అవ్వాల్సిందే?
మామూలుగా స్త్రీ పురుషులకు కాళ్ల పగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. పురుషులు ఈ విష
- By Anshu Published Date - 09:30 PM, Sun - 14 January 24

మామూలుగా స్త్రీ పురుషులకు కాళ్ల పగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. పురుషులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా స్త్రీలు ఈ కాళ్ళ పగుల సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాటి నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్లడంతో పాటు ఎన్నెన్నో కెమికల్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే హోమ్ రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కాళ్ళ పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే అటువంటప్పుడు రెండు చిట్కాలు ఉపయోగిస్తే చాలు ఈ పాదాల పగుళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు.
ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా ఒక గిన్నెలో గోరు వెచ్చటి నీటిని తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ బేగింగ్ సోడా, ఒక షాంపూ ప్యాకెట్ వేయాలి. మీరు వాడే ఏ షాంపూ అయినా పర్లేదు. ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసాన్నంతా ఈ మిశ్రమంలో పిండేయాలి. ఈ తర్వాత బాగా కపిలి పాదాలను అందులో ఉంచాలి. అయితే నీరు మరీ వేడిగా ఉండకూడదు. ఎందుకంటే అసలే పగుళ్లు ఉన్న కాళ్లను అందులో పెడ్తే మంట పుడ్తుంది. అందుకే పాదాలు భరించగల్గినంత వేడి నీటిని మాత్రమే వాడాలి. ఇలా ఒక 30 నిమిషాల పాటు కాళ్లను అందులోనే ఉంచాలి. ఆ తర్వాత పుట్ స్క్రాపర్ ప్యూమిక్ స్టోన్లతో పాదాలను బాగా రుద్దాలి.
అలా చేయడం వల్ల పాదాలపై ఉండే మృత కణాలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయి. అంతే కాకుండా పగుళ్ల వద్ద ఉన్న మృత చర్మం పోయి పాదాల పగుళ్లు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. తర్వాత పొడిగుడ్డతో పాదాలను మంచిగా తుడవాలి. ఆ తర్వాత ఫుట్ క్రీమ్ తయారు చేసుకొని పాదాలకు అప్లె చేసుకోవాలి. మరి ఆ పుట్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా ఒక చిన్నె గిన్నెలో వ్యాజిలెన్ పెట్రోలియం జెల్ ను వేసుకోవాలి. ఇది అన్ని దుకాణాల్లో దొరుకుంతుంది. తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఒక విటామిన్ ఈ క్యాప్సిన్ వేసుకోవాలి. దీనికి బదులుగా బాదం నూనె, ఆముదం నూనె కూడా వాడుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు వేసి పెట్రోలియం జెల్లీ కరిగేలా వేడి చేసుకోవాలి. అంటే వేడి నీటిలో ఈ గిన్నెని పెడ్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజూ పాదాలకు పూసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల కాళ్ల పగులు తగ్గి మృదువుగా తయారవుతాయి. ఈ క్రీమ్ వల్ల పాదాలకు సరైన మోతాదులో తేమ అంది.. పాదులు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.