Andhra Chepala Pulusu: ఆంధ్రస్టైల్ చేపల పులుసు.. ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
మాములుగా మనం చేపలతో చేపల పులుసు, చేపల కర్రీ, చేప కబాబ్ చేప ఫ్రై, చేపల మసాలా కర్రీ ఇలా ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. అయితే ఎప్పుడు
- By Nakshatra Published Date - 06:33 PM, Thu - 14 December 23
మాములుగా మనం చేపలతో చేపల పులుసు, చేపల కర్రీ, చేప కబాబ్ చేప ఫ్రై, చేపల మసాలా కర్రీ ఇలా ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. అయితే ఎప్పుడు అయినా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే ఆంధ్రస్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి. అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆంధ్ర చేపల పులుసుకు కావలసిన పదార్ధాలు:
చేప మసాలా పొడి కోసం
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – ఏడు
మెంతులు – అర టేబుల్ స్పూన్
వెల్లులి – 8 రెబ్బలు
చేప ముక్కలు – 300 గ్రా
నూనె – అర కప్పు
కరివేపాకు – రెండు రెబ్బలు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం వెల్లులి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – అర టేబుల్ స్పూన్
కారం – ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
టొమాటో ముక్కలు – పావు కప్పు
నీళ్ళు – అర లీటర్
చింతపండు పులుసు – 200 ఎంఎల్
కొత్తిమీర – చిన్న కట్ట
ఆంధ్ర చేపల పులుసు తయారీ విధానం:
ఇందుకోసం మొదట మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ సన్నని సెగపై మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి. తర్వాత మెత్తగా పొడి చేసుకోని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత మూకుడులో నూనె వేసి అందులో కరివేపాకు, ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుతూ ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లులి ముద్ద కూడా వేసి వేపుకోవాలి. అవి వేగాక పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేపుకోవాలి. ఆ తరువాత రెడీ చేసుకున్న చింత పండు పులుసు, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ పై మరగనివ్వాలి. మరుగుతున్న పులుసులో చేప ముక్కలు వేసి సన్నని సెగపై నూనె పైకి తేలేదాక మరగనివ్వాలి. 15 నిమిషాలకి నూనె తేలి పులుసు చిక్కబడుతుంది. అప్పుడు కొత్తిమీర తరుగు, చేపల మసాలా పొడి వేసి నెమ్మదిగా ముక్క చిదరకుండా కలిపి మరో 5 నిమిషాలు సన్నని సెగ మీద మరిగిస్తే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ.
Tags
Related News
Chepala Pulusu: ఆంధ్రస్టైల్ చేపల పులుసు.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని మరి తినేయాల్సిందే?
చేపల పులుసు.. ఈ పేరు వినగానే చాలామందికి నోరూరిపోతూ ఉంటుంది. అయితే ఈ చేపల పులుసును ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు.