Pathanjali : రామ్ దేవ్ బాబాకు `సుప్రీం` అక్షింతలు
అల్లోపతి, ఆయుర్వేదం వైద్యం మధ్య కోవిడ్ సమయంలో జరిగిన సంఘర్షణ సుప్రీంకు చేరింది. ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది.
- By Hashtag U Published Date - 03:00 PM, Tue - 23 August 22
అల్లోపతి, ఆయుర్వేదం వైద్యం మధ్య కోవిడ్ సమయంలో జరిగిన సంఘర్షణ సుప్రీంకు చేరింది. ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అల్లోపతిని కించపరిచేలా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రచారాలను నిర్వహించవచ్చని, అయితే ఇతర వ్యవస్థలను విమర్శించకూడదని పేర్కొంది.
` యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చారు. మంచిదే. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించకూడదు. ఆయన చెప్పిన వాటిని అనుసరిస్తే అన్నీ నయం అవుతాయని గ్యారంటీ ఏమిటి?” అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రశ్నించారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్పై దుష్ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు రామ్ దేవ్ బాబాపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఐఎంఏ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.
అల్లోపతి మందుల కారణంగా లక్షల మంది మరణించారని, చికిత్స, ఆక్సిజన్ అందక మరణించిన వారి కంటే మందుల వలన చాలా ఎక్కువ మంది చనిపోయారని వీడియో ద్వారా రామ్ దేవ్ విమర్శించారు. అంతేకాదు, ” యోగా గురువు అల్లోపతిని “మూర్ఖమైన మరియు దివాళా తీసిన” శాస్త్రం అని కూడా పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా భారతదేశంలో చాలా మంది వైద్యులు మరణించారని బాబా విమర్శలు చేసిన వీడియోను సుప్రీం పరిశీలించింది. శాస్త్రీయ ఔషధం పరువు తీసినందున అంటువ్యాధి వ్యాధుల చట్టం కింద కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్య తీసుకొని అతనిపై విచారణ జరపాలని ఐఎంఏ కోరింది.
ఆయుర్వేదంపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బాబా రామ్దేవ్ను ఢిల్లీ హైకోర్టు గత వారం కోరింది. కోవిడ్ -19 కోసం పతంజలి తయారు చేసిన కరోనిల్ను ఉపయోగించడం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని బాబా రామ్దేవ్పై వివిధ వైద్యుల బృందాలు దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ విచారించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు టీకాలు వేసినప్పటికీ కోవిడ్ పాజిటివ్గా తేలిందని యోగా గురువు చేసిన ప్రకటనపై కోర్టుకు సమాచారం అందింది. మొత్తం మీద బాబాకు సుప్రీం ఒక రకంగా చివాట్లు పెట్టింది.
Related News
Supreme Court : మీ ప్రకటనల మాదిరిగానే క్షమాపణలు ఉన్నాయా?: మరోసారి రాందేవ్ బాబాపై సుప్రీం ఆగ్రహం
Supreme Court: రామ్దేవ్ బాబా బృందం(Ramdev Baba Team) పై సుప్రీం కోర్టు(Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి(Patanjali)తప్పుదోవ పట్టించే పకటనల కేసు(పీటీఐ) పై విచారణ సందర్భంగా యోగా గురు రామ్దేవ్ సుప్రీంకోర్టుకు వచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా పతంజలి ఆయుర్వేద్, 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తమ తప�