Weather Today: రాబోయే 5 రోజుల్లో మరోసారి వర్షాలు.. నేడు ఈ రాష్ట్రాలలో వానలు..!
శుక్రవారం (మే 5) దేశ రాజధానితో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం (Weather) పొడిగా ఉంది. దీని కారణంగా ప్రజలు అకాల వర్షాల (Rain Alert) నుండి ఉపశమనం పొందారు.
- Author : Gopichand
Date : 06-05-2023 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
Weather Today: శుక్రవారం (మే 5) దేశ రాజధానితో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం (Weather) పొడిగా ఉంది. దీని కారణంగా ప్రజలు అకాల వర్షాల (Rain Alert) నుండి ఉపశమనం పొందారు. అయితే.. వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి శనివారం (మే 6) నుంచి వానలు ప్రారంభం కావచ్చని సమాచారం. ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో మే 11 వరకు దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా అంచనా వేయబడింది. వాతావరణ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. గత వారం దేశంలో కురిసిన వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. IMD ప్రకారం.. రాబోయే 2 రోజుల్లో ఈశాన్య భారతదేశంలోని ఏకాంత ప్రదేశాలలో మెరుపులు, బలమైన గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పంజాబ్, హర్యానా, కేరళ, మహారాష్ట్రల్లో వర్షాలు
పంజాబ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో శనివారం (మే 6) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్లోని నాగౌర్, అజ్మీర్ జిల్లాలతో పాటు సమీప ప్రాంతాల్లో మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. జోధ్పూర్, పాలి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు మే 7న అండమాన్, తమిళనాడు, పుదుచ్చేరి, నికోబార్, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. IMD ప్రకారం.. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. రాబోయే 5 రోజులలో దేశంలోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ పరిస్థితి లేదు.
Also Read: Rain Alert : ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు – ఐఎండీ
ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం
బీహార్ వాతావరణ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. బీహార్ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, బాగేశ్వర్, పితోర్గఢ్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుంది. మే 6న ఉత్తరప్రదేశ్కు వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. దీని కారణంగా పశ్చిమ యూపీలోని నోయిడా, ఘజియాబాద్, మీరట్ వంటి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మేఘాలు కమ్ముకుని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది.
బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం ఏర్పడుతుందని, దీని కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కాకుండా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం వచ్చే 48 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈ అల్పపీడనం మే 8న అల్పపీడనంగా మారుతుందని, మే 9న వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.