US Visa: ఓపిక పట్టండి, త్వరలోనే వీసాల సమస్య పరిష్కరిస్తాం.. ఇండియాకు అమెరికా హామీ
భారతీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
- By Hashtag U Published Date - 09:01 PM, Wed - 28 September 22
భారతీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ప్రస్తుతం స్టూడెంట్ వీసాలనే కాదు. మిగతా వీసాల జారీ కూడా ఆలస్యంగానే సాగుతోంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని త్వరలోనే కనుగొంటామని అమెరికా తెలిపింది. ఇవాళ వాషింగ్టన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశాంగ మంత్రి) ఆంటోని బ్లింకెన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్లింకెన్ వీసాల గురించి చర్చించారు. భారతీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు హామీ ఇచ్చారు.
“దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం” అని తెలిపారు.
“కొవిడ్ కారణంగా భారత్ నుంచి వచ్చిన వీసా అప్లికేషన్లు చాలా వరకు నిలిచిపోయాయి. ఈ అడ్డంకిని దాటుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ ఈ ప్రాసెస్ను వేగవంతం చేస్తున్నాం. ఇండియా విషయానికొస్తే ఈ బ్యాక్లాగ్ను వీలైనంత త్వరగా కవర్ చేసేందుకు చూస్తున్నాం. రానున్న కొన్ని నెలల్లో ఈ సమస్య పరిష్కారమవుతుంది” అని బ్లింకెన్ వెల్లడించారు. క్వాడ్ , G20తో పాటు యూఎన్ సంబంధిత అంతర్జాతీయ సంస్థల్లో రెండు దేశాలు కలిసి అడుగులు వేస్తున్నాయని బ్లింకెన్ స్పష్టం చేశారు. ” ఈ అడ్డంకిని దాటుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రాసెస్ను వేగవంతం చేస్తున్నాం. ఇండియా విషయానికొస్తే…ఈ బ్యాక్లాగ్ను వీలైనంత త్వరగా కవర్ చేసేందుకు చూస్తున్నాం. రానున్న కొన్ని నెలల్లో ఈ సమస్య పరిష్కారమవుతుంది” అని బ్లింకెన్ వెల్లడించారు.ఈ సమస్యను పరిష్కరించటంలో బ్లింకన్ చొరవ చూపుతారన్న నమ్మకం ఉందని జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
సమస్య ఇదీ..
అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి వీసా చిక్కులు ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. వెయిటింగ్ టైమ్ పెరుగుతున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా వరకూ యూనివర్సిటీలు మూత పడ్డాయి. భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. కొంత కాలంగా అన్ని యూనివర్సిటీలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఫలితంగా వీసాల అప్లికేషన్లు కుప్పల కొద్ది వచ్చి పడుతున్నాయి. దీంతో వెయిటింగ్ టైం పెరుగుతోంది.
ఇండియా నుంచి అమెరికా వెళ్లే వాళ్లకు నాన్ ఇమిగ్రెంట్ వీసా వెయిటింగ్ పీరియడ్ రెండేళ్లకు పైగానే ఉంటోంది. స్టూడెంట్ లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసాల కోసం ఢిల్లీలో 444 క్యాలెండర్ డేస్, విజిటర్ వీసాల కోసం 758 క్యాలెండర్ డేస్, నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం 354 క్యాలెండర్ డేస్ ఎదురు చూడాల్సి వస్తోంది.
బ్రిటన్ గుడ్ న్యూస్
అమెరికాతో పాటు బ్రిటన్ కూడా వీసాలు జారీ చేసే ప్రక్రియను స్పీడప్ చేసింది. బ్రిటన్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వీసా కష్టాలు గట్టెక్కనున్నాయి. కేవలం ఒక్కరోజులోనే వీసా మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేస్తునట్లు.. వీసాలు తొందరగా జారీ చేసేందుకు ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ విధానాలను తీసుకొచ్చినట్లు భారత్లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రకటించారు. ప్రియారిటీ వీసాను అప్లై చేసుకున్న ఐదు రోజుల్లో, సూపర్ ప్రియారిటీ వీసాను దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే పొందవచ్చని వెల్లడించారు. దీని కోసం వీసా ఫీజుతోపాటు అదనఫు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, చివరి పనిదినం రోజున లేదా సెలవురోజు కంటే ఒక రోజు ముందు సూపర్ ప్రయారిటీ వీసాకు దరఖాస్తు చేసుకుంటే గనుక.. ఆ మరుసటి పనిదినం రోజే వీసాల జారీ ఉంటుంది.
Related News
Attacks: అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడులు.. స్పందించిన శ్వేతసౌధం
Attacks on Indians USA: అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో శ్వేతసౌధం(White House) తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన అధ్యక్ష కార్యాలయం.. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయుల(Indians)పై దాడులపై విలేకరులు అ�